Trivikram Srinivas: ఆయన స్టేజ్ ఎక్కి మాట్లాడితే ఆ మాటల్ని వేల మంది యువత శ్రద్ధంగా వింటారు. కేవలం పట్టుమని పది నిమిషాల్లోనే జీవిత సత్యాన్ని చెప్పి జేజేలు కొట్టించుకుంటారు.నేను చెప్పేది ఇప్పుడు ఏ స్వామిజీనో లేదా పండితుడి గురించి కాదు. మన మాటల మాత్రింకుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి. సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ ఒకరు. ప్రజెంట్ మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి-28 అనే సినిమాను త్రివిక్రమ్ తీస్తున్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా కమిట్ అయినట్లు తెలుస్తుంది.
అయితే గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో త్రివిక్రమ్ శ్రీనివాస్–పూజా హెగ్డే గురించి పలు రకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. పూజ హెగ్డేకి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని..షూటింగ్ లొకేషన్లో ఆమెని మహారాణిలా ట్రీట్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ మధ్య ఆమె షూటింగ్కు వచ్చేందుకు కొత్త కారు కూడా కొన్నట్లు వార్తలు వచ్చాయి. కేవలం పూజ హెగ్డేతోనే కాదు మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్తోనూ త్రివిక్రమ్ వ్యవహారం వేరేగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్గా ఉన్న ఈయన ఏ తప్పు చేయకపోయినా తనపై ఇలాంటి గాసిప్స్ రావడానికి కారణం హీరోయిన్ పెట్టిన శాపనార్ధాలే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్గా మారాయి.
పొట్టి సుందరి నిత్యామీనన్తో సన్నాఫ్ సత్యమూర్తి సినిమా టైంలో వర్క్ చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్. నిజానికి ఆ టైంలో ఫస్ట్ హీరోయిన్గా నిత్యామీనన్ని అనుకున్నారు. కానీ ఆ తర్వాత సమంత కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వడంతో.. నిత్యామీనన్ను సెకండ్ హీరోయిన్గా చేశారు. ఫస్ట్ హీరోయిన్ సమంతను పెట్టారు. అంతే కాదు భీమా నాయక్ సినిమా విషయంలోనూ నిత్యామీనన్ని త్రివిక్రమ్ బాగా హర్ట్ చేసాడని టాక్ వినిపించింది.
ఆ సందర్భంలోనే మలయాళీ కుట్టి నిత్యామీనన్, త్రివిక్రమ్ శ్రీనివాస్కు శాపనార్థాలు పెట్టిందట. ఏ పాపులారిటిని చూసుకుని విర్ర వీగుతున్నాడో..అది మొత్తం సర్వ నాశనం అయిపోతుంది. ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాడు..ఫేమ్ పడిపోతదంటూ శాపనార్థాలు పెట్టిందట. ఈ క్రమంలోనే ఒక్కొక్కటిగా త్రివిక్రమ్ డౌన్ ఫాల్ అవుతున్నాడు.