Nagarjuna-Anushka: నాగ్-అనుష్క మధ్య అలాంటి సంబంధం ఉందా?

Nagarjuna-Anushka: అలనాటి స్టార్ హీరో అక్కినేని నాగేశ్వరావు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటవారసుడిగా అక్కినేని నాగార్జున హీరోగా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఆయన ఇండస్ట్రీలో కింగ్, మన్మథుడు అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఆయన తనదైన శైలిలో నటిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నాగార్జున హీరోగా వెండితెరపై రాణిస్తూనే బుల్లితెరపై అడుగులు వేశారు.

మా టీవీలో ప్రసారమైన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోలో మొదటిసారిగా హోస్ట్ గా వ్యవహరించారు. ఆ తర్వాత కూడా ఆయన మా టీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆయన బిగ్ బాస్ సీజన్ త్రీ నుండి హోస్ట్ గా రాణిస్తూనే ఉన్నారు. వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా నాగార్జున ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అప్పట్లో నాగార్జున ఓ హీరోయిన్‌తో లవ్‌లో ఉన్నట్లు చాలా వార్తలు వినిపించాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఒక్కసారి చూద్దామా.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన సినిమా ‘సూపర్’. ఈ చిత్రంలో అనుష్క సెకండ్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతోనే అనుష్క చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీరిద్దరూ కలిసి సూపర్, డమరుకం, డాన్, రగడ వంటి సినిమాల్లో నటించారు. ఇక అప్పట్లో వీరిద్దరిపై సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే.. నాగార్జున, అనుష్క రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ వార్తలు వినిపించాయి. నాగార్జున నటించే ప్రతి సినిమాలో.. చిన్న పాత్రలో కూడా అనుష్క ఉంటుందంటూ వార్తలు వచ్చాయి. అలాగే అనుష్క, నాగ చైతన్యను కూడా పెళ్లి చేసుకుంటుందంటూ వార్తలు వినిపించాయి.

నాగార్జున, అనుష్కలపై వస్తున్నా రూమర్లపై ఇద్దరూ స్పందించారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉందని అన్నారు. దీంతో వీరిపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు. ఇక నాగార్జున వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. స్టార్ హీరోయిన్ అనుష్క మాత్రం బాహుబలి సినిమా తర్వాత ఇండస్ట్రీకి విరామం ప్రకటించింది. ప్రస్తుతం ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఫ్యామిలీతో గడుపుతుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త కష్టాలు మొదలయ్యాయా.. కుట్రలకు బలి కామని జనం చెబుతున్నారా?

YSRCP: ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి రోజుకు రాజుకుంటుందని చెప్పాలి. మరి 20 రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఇప్పటికే పెద్ద ఎత్తున అన్ని పార్టీ నేతలు ప్రచార కార్యక్రమాలను నామినేషన్లను దాఖలు చేస్తూ...
- Advertisement -
- Advertisement -