Pawan-Renu Desai: పవన్ రేణు దేశాయ్ లను విడగొట్టిన పాపం ఆ దర్శకుడిదేనా?

Pawan-Renu Desai: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం రాజకీయాలలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.ఇక పవన్ కళ్యాణ్ కెరియర్ గురించి పక్కన పెడితే ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

 

పవన్ కళ్యాణ్ మొదట కుటుంబ సభ్యులు సూచనల మేరకు నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే ఈమెకు విడాకులు ఇచ్చిన తర్వాత నటి రేణు దేశాయ్ ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక వీరిద్దరూ ప్రస్తుతం విడిపోయి దూరంగా ఉంటున్న విషయం మనకు తెలిసిందే.ఇలా పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడిపోవడంతో వీరిద్దరూ విడిపోవడానికి ఒక స్టార్ డైరెక్టర్ కారణమంటూ గతంలో వార్తలు వచ్చాయి.

ఇకపోతే తాజాగా గత వార్తలు అన్నింటిని బయటకు పెడుతున్నారు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్.బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ చేసిన సంచలనంగా మారుతుందనే విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా గురూజీ అంటూ పరోక్షంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే ఉద్దేశిస్తూ చేసినటువంటి వరుస ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

సినిమాలు నిర్మాతగా అవకాశాలు రావాలి అంటే గురూజీని కలిసి భారీ గిఫ్ట్ ఇస్తే చాలు అంటూ త్రివిక్రమ్ గురించి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చేసిన వెంటనే భార్యాభర్తలను విడగొట్టాలన్న, తండ్రి కొడుకులను, గురు శిష్యులను విడగొట్టాలన్నా అది కేవలం గురూజీకి మాత్రమే సాధ్యమవుతుంది అంటూ ఈయన మరొక ట్వీట్ చేశారు. ఇలా బండ్ల గణేష్ ఇలాంటి ట్వీట్ చేయడంతో ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఉద్దేశించే ఇలాంటి కామెంట్స్ చేశారని అందరికీ అర్థమవుతుంది.

 

గత కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ కు రైట్ హ్యాండ్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. త్రివిక్రమ్ పవన్ వద్దకు రాగానే ఎప్పటినుంచో ఆయనతో సన్నిహితంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కొక్కరు దూరమవుతూ వస్తున్నారు.ఇలా పవన్ కళ్యాణ్ కు సన్నిహితులంతా దూరం కావడంతో కేవలం త్రివిక్రమ్ కారణంగానే దూరం అవుతున్నారని పలువురు భావిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -