Amaravathi: అమరావతి విషయంలో చంద్రబాబు కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ ఉందా?

Amaravathi: గడిచిన మూడున్నర సంవత్సరాలుగా ఏపీలో రాజధాని అమరావతి విషయంలో ఎన్నో రకాల వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో దీనికి శంకుస్థాపన జరిగింది. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన త‌ర్వాత‌ రాజ‌ధాని లేకుండా ఏర్ప‌డిన ఏపీకి అత్య‌ద్భుత‌మైన న‌గ‌రం రాజ‌ధానిగా ఉండాల‌ని త‌ల‌పోసిన అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు దానికి అనుగుణంగానే 33 వేల ఎక‌రాల‌ను ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతుల నుంచి సేక‌రించారు. దీనిని అభివృద్ధి చేసేందుకు సింగ‌పూర్‌, దుబాయ్ దేశాల‌కు చెందిన క‌న్సల్టెన్సీల‌ను కూడా రప్పించారు. ఇక‌, ఇక్క‌డే స‌చివాల‌యం, అసెంబ్లీ, హైకోర్టును నిర్మించారు.

మ‌రిన్ని ప‌నులు ప‌రుగులు పెట్టే ద‌శ‌లో ఉండ‌గా 2019లో వ‌చ్చిన ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మి బాట‌ప‌ట్టి వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. ఇక‌, అప్ప‌టి నుంచి సీఎం జ‌గ‌న్ మూడు రాజ‌ధానులు అంటూ ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం విశాఖ‌ను రాజ‌ధాని చేస్తాన‌ని అక్క‌డే కాపురం ఉంటాన‌ని కూడా ప్ర‌క‌టించారు. దీంతో రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన‌ రైతులు ఉద్య‌మానికి దిగారు. అనేక పాద‌యాత్ర‌లు చేశారు. ఇప్ప‌టికీ ఇంకా దీక్ష‌లు కొన‌సాగుతున్నాయి. మ‌రో 9 నెల‌ల్లో ఎన్నిక‌లు ఉన్నాయి. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఒక రాజ‌ధాని న‌గ‌రం లేకుండా పోయింద‌నే వాద‌న స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

 

అమరావతి విషయంలో ఆందోళన అక్కర్లేదని, టీడీపీ అధికారంలోకి రాగానే పనులు పరుగులు పెట్టిస్తామని చంద్రబాబు తెలిపారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఐటీడీపీ కార్యకర్తల సదస్సులో పాల్గొన్న ఆయన టీడీపీ మేనిఫెస్టో లో ప్రకటించిన ప్రతి విషయం చాలా విలువైందని, ప్రతి ఒక్కరికీ వీటిని చేరువ చేయాలని ఐటీడీపీ కార్యకర్తలకు సూచించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు రాజ‌ధాని అంశాన్ని కూడా ప్ర‌స్తావించారు. ఏపీలోనూ హైదరాబాద్‌కు దీటుగా మరో నగరం కట్టాలని సంకల్పించామ‌ని అన్నారు.

అమరావతి కోసం రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారని, అందుకే అక్క‌డ అమ‌రావ‌తి వంటి స‌న్‌ రైజ్ స్టేట్‌లో గొప్ప రాజ‌ధాని ని ఏర్పాటు చేయాల‌ని సంక‌ల్పించామ‌న్నారు. పార్టీ పై విశ్వాసంతోనే 29 వేల మంది రైతులు భూములిచ్చారన్న చంద్ర‌బాబు టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అమరావతిలో పనులు పరుగులు పెట్టిస్తామ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఐటీడీపీ స‌ద‌స్సులో ఉన్నవారు త‌మ క‌ర‌తాళ ధ్వ‌నుల‌తో మోతెక్కించ‌డం గ‌మ‌నార్హం. కాగా, వాస్త‌వానికి ఇటీవ‌ల జ‌రిగిన మ‌హానాడులోనే చంద్ర‌బాబు అమ‌రావ‌తిపై మాట్లాడ‌తార‌ని చాలా మంది ఎదురు చూశారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -