Manoj-Mounika: మొత్తానికి ప్రేమ గురించి తమపై వచ్చిన వార్తలను పెళ్లి తో నిజం చేశారు మంచు మనోజ్, భూమా మౌనిక. రీసెంట్ గా వీరిద్దరూ తమ కుటుంబ సమక్షంలో పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. అప్పటికే మనోజ్ 2017లో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోగా.. మనస్పర్ధలు కారణాలతో 2019లో విడాకులు తీసుకున్నాడు. అలా కొంత కాలం ఒంటరిగా ఉన్న మనోజ్ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మౌనిక.
అలా ఆమెతో తిరుగుతూ మీడియా దృష్టిలో పడ్డాడు. ఇక ఆ సమయంలో ప్రత్యేక పూజలు చేయించగా అందరికి అనుమానాలు మొదలయ్యాయి. ఇక ఆ వార్తలనే నిజం చేశారు. ఇక మౌనిక కు కూడా అప్పటికే పెళ్ళై ధైరవ్ రెడ్డి అనే బాబు కూడా ఉన్నాడు. దీంతో పెళ్లి తర్వాత ఆ బాబు బాధ్యతలు తనవే అని మనోజ్ అన్నట్లు.. ధైరవ్ తమ వద్దే పెరుగుతాడని స్పష్టత ఇచ్చాడని తెలిసింది. మాములుగా మనోజ్ కి మొదటి భార్యతో పిల్లలు లేరన్న సంగతి అందరికి తెలిసిందే.
ఇక ప్రస్తుతానికి మనోజ్ ఆస్తికి ధైరవ్ వారసుడు అయ్యాడని అర్ధమవుతుంది. మౌనిక, మనోజ్ పిల్లలు కనే వరకు ధైరవ్ నే వారసుడని తెలుస్తుంది. అయితే ఈ సమయంలో మంచు కుటుంబం ఫైర్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఎలాంటి సంబంధం లేని మౌనిక కుమారుడు ఆస్తికి వారసుడు ఎలా అవుతాడని ఫైర్ అవుతున్నారట. ఈ నేపథ్యంలో పెళ్ళైన కొద్దిరోజులకే ఈ విషయంలో మనోజ్, మౌనిక మధ్య గొడవలు మొదలయ్యాయని తెలుస్తుంది. ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త బాగా వైరల్ అవుతుంది.