Chiranjeevi Lakshmi Narayana: చిరంజీవిని లక్ష్మీ నారాయణ కలవడం వెనుక ఇంత కథ ఉందా?

Chiranjeevi Lakshmi Narayana: తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాజీ సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీబీఐ హోదాలో ఉన్న సమయంలో ఎన్నో కఠినమైన కేసులను దర్యాప్తు చేశారు. ఇక ఆ మధ్యనే రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టాడు. వచ్చే రాజకీయాలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని కూడా తెలిసింది. ఇదంతా పక్కనే పెడితే తాజాగా ఆయన తన సతీమణి ఊర్మిళతో కలిసి చిరంజీవి దంపతులను కలిశారు.

ఇక వీరంతా కలిసి ఉన్న ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయన చిరంజీవిని ఎందుకు కలిశారు అన్న అనుమానాలు రావడంతో దాని వెనుక ఒక విషయం ఉందని బయటపడింది. అదేంటంటే జేడి లక్ష్మీనారాయణ తన కూతురు ప్రియాంకకు పెళ్లి చేయనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా చిరంజీవికి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి కలిశారని తెలిసింది.

 

ఇక తమ కూతరు పెళ్లికి రావాలంటూ ఆయన ఆహ్వానించారు. దీనికి చిరంజీవి దంపతులు సంతోషంగా స్పందించినట్లు తెలిసింది. ఇక జేడీ కూతురు ప్రియాంక సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది. ఇక ఈమె కూడా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. కానీ ఈ విషయం గురించి తన తండ్రి ఏమాత్రం హింట్ ఇవ్వలేదు. ఇక జేడీ కూడా రాజకీయపరంగా ప్రజలను తన వైపుకు మలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లక్ష్మీనారాయణ.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపాడు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -