Veera Simha Reddy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కేవలం డైలాగులతోనే సినిమాకు హైప్ తీసుకురాగల సత్తా ఒక్క నందమూరి బాలయ్యకు మాత్రమే ఉంది. నందమూరి బాలయ్య డైలాగులు చెప్పాడంటే థియేటర్ మొత్తం ఊగిపోవాల్సిందే. అలాంటి డైలాగులను భారీగా కలిగి, బాలయ్యకు ఎంతో బాగా కలిసి వచ్చే ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే కథతో బాలయ్య ఈసారి సంక్రాంతి బరిలో నిలిచి.. భారీ హిట్ అందుకున్నాడు.
దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలయ్య హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా చేసిన సినిమా ‘వీరసింహారెడ్డి’. ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. బాలయ్య కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ ఈ సినిమాకు వచ్చాయి. మొదటిరోజే ఈ సినిమాకు రూ.27 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం.
సంక్రాంతికి వరుస సెలవులకు తోడు, హిట్ టాక్ తెచ్చుకున్న బాలయ్య ‘వీరసింహారెడ్డి’ వంద కోట్ల కలెక్షన్లను సాధించింది. సినిమా విడుదలైన నాలుగు రోజుల్లో 104 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్ వెల్లడించింది. మొత్తానికి ఈ సంక్రాంతికి బాలయ్య భారీ హిట్ అందుకున్నాడు. దీంతో నందమూరి బాలయ్య, డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో పాటు నందమూరి అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
‘వీరసింహారెడ్డి’ సినిమా విజయం తర్వాత డైరెక్టర్ గోపిచంద్ మలినేని, హీరో నందమూరి బాలయ్యను కలిశాడు. తమ సినిమా సక్సెస్ గురించి వారు మాట్లాడున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు కలిసి ఓ ఫోటో తీసుకోగా.. అందులో ఇద్దరి ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. బాలయ్య సంతోషానికి అవధులు లేకుండా పోయాయనే టాక్ నడుస్తుండగా.. ఈ సినిమా హిట్ అవడానికి బాలయ్య యాక్టింగే కారణం అని డైరెక్టర్ గోపిచంద్ మలినేని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ సినిమా.. యూఎస్ లో జోరుగా వసూళ్లు రాబడుతోంది.