Nayanthara: నయన్ కు పిల్లలు పుట్టకపోవడానికి రీజన్ ఇదేనా?

Nayanthara: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు సంపాదించుకున్న నయనతార గురించి ఎంత చెప్పినా తక్కువే.సౌత్ ఇండస్ట్రీలోనే అందరికన్నా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి నయనతార గత రెండు దశాబ్దాల నుంచి ఏమాత్రం అవకాశాలను కోల్పోకుండా వరుస సినిమా అవకాశాలతో బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో సక్సెస్ అయినటువంటి నయనతార తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.

 

ఈమె వ్యక్తిగత జీవితంలో నటుడు శింబు అలాగే డైరెక్టర్ ప్రభుదేవా వంటి వారితో ప్రేమలో పడటం అలాగే వీరి ప్రేమకు బ్రేకప్ చెప్పుకోవడం వంటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉంటూ 2022 జూన్ 9వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా వీరి వివాహం చేసుకున్నారు. ఇలా సహజీవనం చేస్తూ ఈ దంపతులు జూన్ నెలలో పెళ్లి చేసుకుని అక్టోబర్ నెలలో తల్లిదండ్రులుగా మారారు.

 

ఇలా పెళ్లయిన నాలుగు నెలలకే ఇద్దరు కవల మగ పిల్లలకు ఈ దంపతులు తల్లిదండ్రులు కావడంతో ఈ విషయం పెద్ద ఎత్తున వివాదంగా మారింది.సాధారణంగా పెళ్లి జరిగిన ఐదు సంవత్సరాలకు సరోగసి ద్వారా పిల్లలను కనవచ్చు లేదా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటే సరోగసి ద్వారా పిల్లలను కనవచ్చు కానీ నయనతార దంపతులు కేవలం పెళ్లి జరిగిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చారు.

 

ఇలా నాలుగు నెలలకే పిల్లలకు జన్మనివ్వడంతో ఈ విషయం పెద్ద ఎత్తున వివాదంగా మారింది. అయితే నయనతార విగ్నేష్ సరోగసికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించడంతో ఈ వివాదం కాస్త సర్దుమనిగింది. అయితే నయనతార సరోగసి ద్వారా పిల్లలకు జన్మనివ్వడానికి ఓ కారణం ఉందని తెలుస్తోంది. ఈమెకు గర్భసంచిలో సమస్య ఉండటం వల్లే నయనతార సరోగసి ద్వారా పిల్లల్ని కన్నారని సమాచారం అందుతోంది. అందుకే ఈ దంపతులు పెళ్లికి ముందే సరోగసికి ప్లాన్ చేశారని సమాచారం.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -