CM KCR: అరకొర నిధులతో కడుపెట్లా నింపేది.. సీఎం కేసీఆర్ ఆలోచిస్తారా?

CM KCR: తెలంగాణ సర్కార్రాష్ట్ర దశాబ్ద వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోని తెలంగాణలోని ప్రతి ఒక్క గ్రామంలో కూడా చెరువు పండగ చేయాలి అంటూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రతి గ్రామంలో చెరువు పండుగ చేయడం కోసం గ్రామానికి 25000 నిధులు మంజూరు చేశారు.ఇలా ఈ డబ్బులతో గ్రామస్తులందరికీ చికెన్ తో పాటు మరొక వెజిటేరియన్ కర్రీ వైట్ రైస్ పాపడ్ వంటి వివిధ రకాల ఆహార పదార్థాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

అలాగే చెరువు కట్టపై పెద్ద ఎత్తున రంగువలు వేసి మామిడి తోరణాలు కట్టి ప్రత్యేక పూజలు చేయాలని, చెరువు దగ్గర గజ ఈతగాలను సిద్ధంగా పెట్టాలని తెలిపారు .డప్పు వాయిద్యాలు నడుమ ఈ చెరువు పండుగను నిర్వహించాలని తెలిపారు. అంతేకాకుండా చెరువు వద్దకు వెళ్లడం కోసం మార్గమంతా లైట్లు వేసి డెకరేషన్ చేయాలని అలాగే ఆ ప్రదేశం అంతా చదును చేయడం కోసం వంట సామాగ్రిని తీసుకురావడం కోసం కూడా ఇదే డబ్బులను ఉపయోగించాలని తెలిపారు.

 

ఈ విధంగా గ్రామం మొత్తానికి నాన్ వెజ్ పెట్టాలి అంటూ 25 వేల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయడంతో గ్రామ సర్పంచులు ఒక్కసారిగా భయపడుతున్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి పనులను పెద్ద ఎత్తున అప్పులు చేశామని ఇప్పుడు 25 వేలుతో గ్రామస్తులందరికీ నాన్ వెజ్ ఎలా పెట్టగలం ఇది ఎలా సాధ్యమవుతుంది అంటూ సర్పంచులు తలలు పట్టుకున్నట్లు తెలుస్తోంది.

 

చిన్న పెద్ద అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్క గ్రామానికి 25000 మంజూరు చేయడం పట్ల సర్పంచులు కొంత పాటి అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిన్న గ్రామాలకి 25000 ఏమాత్రం సరిపోవు అలాంటిది నాలుగు ఐదు వేల మంది జనాభా ఉన్నటువంటి గ్రామాలకు 25 వేలుతో ఎలా భోజనం పెట్టాలి అంటూ తలలు పట్టుకున్నారు. ఇక గ్రామస్తులకు కడుపునిండా భోజనం పెట్టకపోతే తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -