Warangal: పెళ్లయి నాలుగేళ్లు అయింది.. పిల్లలు కలగలేదని?

Warangal: మామూలుగా పెళ్లి అయిన తర్వాత కొందరికి వెంటనే పిల్లలు కలిగితే ఇంకొందరికి ఆలస్యంగా పిల్లలు పుడుతూ ఉంటారు. చాలామంది పెళ్లయి చాలా ఏళ్ళు అవుతున్నా పిల్లలు కలగడం లేదని బాధపడుతూ హాస్పిటల్ చూస్తూ దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇటువంటి సమయంలోనే కొంతమంది పిచ్చిగా ఆలోచించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తాజాగా కూడా ఒక వ్యక్తి అలాంటి పని చేశాడు. పెళ్లయి నాలుగేళ్లు గడుస్తున్నా పిల్లలు కలగడం లేదని ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే..

వరంగల్ జిల్లా ఏటూరు నాగారం పరిధిలోని ఎలిశెట్టిపల్లి గ్రామంలో చంద్రశేఖర్- మౌనిక దంపతులు నివసిస్తున్నారు. ఈ జంటకు నాలుగు ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా బతుకుతున్నారు. వివాహం జరిగి నాలుగు ఏళ్లు గడిచింది. కానీ, ఇంతవరకు ఈ దంపతులకు పిల్లలు కలగలేదు. దీంతో ఈ భార్యాభర్తలు ఎందరో దేవుళ్ల వద్దకు తిరిగారు. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఇదే విషయమై దంపతులు ఈ నెల 28న గొడవ కూడా పడ్డారు. దాంతో మౌనిక పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలు కలగకపోవడం, భార్య పుట్టింటికి వెళ్లడంతో చంద్రశేఖర్ తట్టుకోలేకపోయాడు.

 

అదే రోజు ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన అతడి కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ చంద్రశేఖర్ తాజాగా ప్రాణాలు విడిచాడు. దాంతోచంద్రశేఖర్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -