Jabardast: బాడీ షేమింగ్ కామెంట్స్ భరించలేక షో నుంచి తప్పుకోనున్న యాంకర్?

Jabardast: బుల్లితెరపై బజర్దస్త్ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. దశాబ్ద కాలంగా జబర్దస్త్ షో అందర్నీ అలరిస్తూ ముందుకు సాగుతోంది. ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నో మార్పులతో సాగుతోంది. వివాదాలు, తగాదాలు జరుగుతున్నా జబర్దస్త్ షో మాత్రం ఆగడంలేదు. పాత, కొత్త కొంటెస్టెంట్లతో జోరుగానే షో ముందుకు సాగుతోంది. ఈ షో నుంచి చాలా మంది బయటకు వెళ్తున్నా వస్తున్నవారు కూడా తగ్గడం లేదు.

 

ప్రారంభంలో ఈ షోకు జడ్జిలుగా ఉన్ననాగబాబు, రోజాలు ఒకరి తరువాత మరొకరు వెళ్లగా ఆ తర్వాత టీమ్ లీడర్లు, కంటెస్టెంట్లు వెళ్లిపోయారు. స్టార్ యాంకర్ అనసూయ కూడా ఈ షో నుంచి వెళ్లిపోయింది. అయితే ఆ సమయంలో జబర్దస్త్ షో ఆగిపోతుందని అందరూ అనుకున్నా ఆ తర్వాత మాత్రం షో ఆగకుండా నిరంతరంగా సాగుతోంది. అనసూయ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా సౌమ్య రాయ్ వచ్చింది. అయితే తాజాగా సౌమ్య రాయ్ కూడా ఈ షో నుంచి వెళ్లిపోతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అనసూయ ఏ కారణంతో అయితే ఈ షో నుంచి వెళ్లిపోయిందో సౌమ్య కూడా అదే కారణంతో జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

 

ఈ మధ్య కొంతకాలంగా జబర్దస్త్ షోలో బాడీ షేమింగ్ గురించి పలు రకాల కామెంట్స్ వినపడుతున్నాయి. బాడీ షేమింగ్ గురించి హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్నారని అనసూయ తప్పుకుంది. ఈ తరుణంలోనే కొత్తగా అడుగు పెట్టిన సౌమ్య కూడా హైపర్ ఆది లాంటి వాల్ల చేతిలో బలైపోయింది. డబుల్ మీనింగ్ డైలాగులతో ఆమె చాలా విసిగిపోయిందని, బాడీ షేమింగ్ కామెంట్స్ తట్టుకోలేక షో నుంచి బయటకు వచ్చేస్తోందని సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి.

 

సౌమ్య ఆమె అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకుని మరి జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోతున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. దీంతో అనసూయ చెప్పిన బాడీ షేమింగ్ కామెంట్స్ నిజమే అని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జబర్దస్త్ షో గురించి మరో వివాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -