Jabardasth: కాంట్రవర్సీలకు కేరాఫ్గా ‘జబర్దస్త్’ షో కొనసాగుతోంది. షో ప్రారంభంలో కామెడీ కోసం ప్రయత్నించినా.. రాను రాను బూతు మాటలు, వల్గర్ పంచులతో కొనసాగిస్తున్నారు. కానీ కామెడీ స్కిట్స్ అని ఎంటర్టైన్మెంట్ చేస్తుండేసరికి ఎవరూ ఈ షోను పట్టించుకోవడం లేదు. అయితే అప్పుడప్పుడు మాత్రం షో వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. జబర్దస్త్ షోకి కొత్త యాంకర్ సౌమ్యరావు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కన్నడ బ్యూటీ వచ్చి రెండు వారాలు గడిచింది. షోలో తన మార్క్ చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ షోలో హైపర్ ఆది పంచులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. మరీ రెచ్చిపోయినట్లు ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. దాంతో షోపై మళ్లీ విమర్శలు వెల్లువెత్తాయి.
జబర్దస్త్ షో ప్రారంభమైనప్పుడు ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. అప్పుడు యాంకర్ అనసూయను తీసుకొచ్చారు. అయితే కెరీర్ ప్రారంభంలో అనసూయపై కూడా కామెంట్లు చేసేవారు. అయినా ఆమె 9 ఏళ్ల పాటు షోలో కొనసాగింది. జబర్దస్త్ రెండో షో ప్రారంభమైంది. ఆ షోకు యాంకర్ రష్మిని తీసుకొచ్చారు. అనసూయ షో నుంచి బయటికి వెళ్లడంతో.. రెండు వారాల క్రితం సౌమ్యరావుని యాంకర్గా తీసుకొచ్చారు. అయితే సౌమ్యరావు తెలుగు, కన్నడ సీరియల్స్ లో నటించింది. కొద్ది నెలల క్రితం ఓ ప్రోగ్రామ్లో హైపర్ ఆదిపై వరుసగా పంచులేసింది. దాంతో ఆమెను జబర్దస్త్ హాట్ సీట్లో కూర్చోబెట్టారు.
అయితే లేటెస్ట్ ఎపిసోడ్లో సౌమ్యరావుపై హైపర్ ఆది రెచ్చిపోయి కామెంట్స్ చేశాడు. జబర్దస్త్ జడ్జి కృష్ణ భగవాన్.. ‘ప్రపంచంలో అందరూ చనిపోయి.. మీరిద్దరు (ఆది-సౌమ్య) మాత్రమే మిగిలితే ఏం చేస్తారు.’ అని అడిగారు. దానికి ఆది.. ‘మేమిద్దరం కలిసి ఓ ప్రపంచాన్నే సృష్టిస్తాం. వరుసగా ఒకరి తర్వాత మరొకరిని కంటాం.’ అని చెప్పాడు. ఆది కామెంట్స్ కి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక సౌమ్య తలదించుకుంది. దాంతో ఆది ప్రవర్తన చూసి నెటిజన్లు మండిపడుతున్నారు.