Jabardsasth: తెలుగు లోగిళ్లలో గడిచిన పదేండ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ అత్యధిక రేటింగ్స్తో దూసుకుపోతున్న కామెడీ షో జబర్దస్త్కు కొత్త యాంకర్ వచ్చింది. జబర్దస్త్ ప్రారంభం నుంచి నిన్నా మొన్నటివరకు జబర్దస్త్లో యాంకర్గా చేసిన అనసూయ.. ఈ షో నుంచి తప్పుకోవడంతో కొన్నాళ్లపాటు నిర్వాహకులు ఎక్స్ట్రా జబర్దస్త్ చూసుకుంటున్న రష్మీనే కొనసాగించారు. కానీ తాజాగా ఆమె కూడా బిజీ అవుతుండటంతో జబర్దస్త్కు కొత్త యాంకర్ అవసరమొచ్చింది.
రష్మీ స్థానంలో సౌమ్యా రావును కొత్త యాంకర్గా తీసుకొచ్చారు నిర్వాహకులు. ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీమంతుడు సీరియల్లో నటిస్తున్న సౌమ్యను జబర్దస్త్ కొత్త యాంకర్గా తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది.
ఎవరీ సౌమ్య..?
కన్నడ కస్తూరిలా మెరిసే ఈ ముద్దుగుమ్మది కర్నాటక. శివమొగ్గ జిల్లాకు చెందిన సౌమ్యా పూర్తి పేరు సౌమ్య పూర్తి పేరు సౌమ్యా రావ్ నడిగ్ (సౌమ్యా శారాద అని కూడా పిలుస్తారు). బెంగళూరులో కాలేజీ చదువు తర్వాత నటన మీద ఆసక్తితో ఈవైపుగా అడుగులు వేసిన సౌమ్య.. వెండితెర కంటే ముందు బుల్లితెరకు పరిచయమైంది. కన్నడంలో పట్టేదారి ప్రతిభ అనే సీరియల్ ద్వారా ఇంట్రడ్యూస్ అయిన ఈమె.. తమిళంలో రోజా సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అంతేగాక తమిళ్ లో ఆమె నటించిన ధారావాహికలు నెంజమ్ మరప్పత్తిల్లై, వల్లి లు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. తెలుగులో ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీమంతుడు సీరియల్ ద్వారా ఆమె ఇక్కడ అడగుపెట్టింది.
ఆ షో తో ఫేమ్..
సీరియల్స్ ద్వారా ఆమె గుర్తింపు దక్కించుకున్నా సౌమ్యకు సోషల్ మీడియాలో బాగా క్రేజ్ వచ్చింది మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఆదితో కలిసి చేసిన షో లోనే. ఈ షోకి వచ్చిన ఆమె.. వచ్చీరాని తెలుగులో హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్లను ఆటాడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. దీంతో ఆమెను ఈ షోకు పదే పదే తీసుకొచ్చారు. ఆది-సౌమ్యల సంభాషణకు సంబంధించిన వీడియోల క్రేజ్ చూసిన జబర్దస్త్ మేకర్స్.. ఆమెను ఏకంగా షోకు యాంకర్ చేశారు.
తొలి ఎపిసోడ్ తోనే పంచులు..
జబర్దస్త్కు కొత్త యాంకర్ రాబోతుంది అని సర్ఫ్రైజ్ ఇచ్చిన నిర్వాహకులు తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఆమెను రివీల్ చేశారు. ఈ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తున్న ఇంద్రజ.. సౌమ్యను పరిచయం చేశారు. ఈ సందర్భంగా సౌమ్య.. హైపర్ ఆది, రాంప్రసాద్ మీద పంచుల వర్షం కురిపించింది. ‘నువ్వు యాంకరా..?’అని ఆది అడగ్గా.. ‘మీరు కామెడీ చేసినప్పుడు నేను యాంకర్ అవ్వకూడదా..?’ అని కౌంటర్ ఇచ్చింది. అదే సమయంలో రాంప్రసాద్ స్టేజీ మీదకు రాగానే ‘కొత్త యాంకర్ వచ్చొందని తెలియగానే రాంప్రసాద్ స్టేజ్ మీదకు వచ్చాడు..’ అని ఇంద్రజ అనగానే.. ‘కొత్తది ఏం వచ్చినా వస్తారా మీరు..’ అని సౌమ్య వేసిన పంచ్ నవ్వులు పూయించింది.
రష్మీ మాదిరిగానే సౌమ్య కూడా తెలుగమ్మాయి కాదు. కన్నడ నుంచి వచ్చిన ఆమె తెలుగు కూడా అంతంత మాత్రమే. కానీ గ్లామర్ లో మాత్రం సౌమ్య.. అనసూయ, రష్మీల కంటే బెటరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి పదేండ్లుగా అనసూయ, రష్మీలను చూసిన జబర్దస్త్ అభిమానులను సౌమ్య ఎలా అలరిస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్..!
https://www.youtube.com/watch?v=eiPK91Izssc