Jio Laptop: ప్రపంచంలో రిలయన్స్ జియో ఎన్నో సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇప్పటికే జియో 4g నెట్ ద్వారా సంచలనం సృష్టించిన రిలయన్స్ మరో సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. ఉన్నత చదువులు చదవాలి మంచి ఉద్యోగం చేయాలనుకుని ల్యాప్టాప్తో ఇబ్బంది పడే పేద విద్యార్థులకు రిలయన్స్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఇటీవల కాలంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అత్యంత తక్కువ ధరకే ల్యాప్టాప్ లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
ఈ క్రమంలోనే జియో సంస్థ నుంచి అత్యంత తక్కువ ధర కేవలం 15000 రూపాయలకే ఎన్నో అధునాతన ఫీచర్స్ కలిగినటువంటి ల్యాప్ టాప్ ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు టెక్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ల్యాప్టాప్ తయారు చేయడం కోసం రిలయన్స్ సంస్థ ఇప్పటికే మైక్రో ప్రాసెసర్ల తయారీ సంస్థ క్వాల్ కమ్, ఆపరేటింగ్ సిస్టం కోసం మైక్రోసాఫ్ట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ లాప్టాప్ లో జియో ఆపరేటింగ్ సిస్టం తోపాటు జియోకు సంబంధించిన కొన్ని యాప్స్ను, ఇతర సదుపాయాలను జియో ల్యాప్టాప్లో ముందే ఇన్స్టాల్ చేసి అందించనుంది.ఇవి కాకుండా ఇంకా అవసరమైనటువంటి యాప్స్ ను జియో స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుని ఉపయోగించే అవకాశాన్ని కూడా కల్పించనున్నారు.అయితే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జియో టెలికాంకు ఏకంగా 42 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. అయితే అత్యంత తక్కువ ధరకే ఈ ల్యాప్టాప్ లను అందుబాటులోకి తీసుకురావడం వల్ల కస్టమర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఈ నెలలోనే ఈ జియో లాప్ టాప్ లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.