Jr NTR-Chiranjeevi: చిరంజీవి ఎవరో తెలియదని జూనియర్ ఎన్టీఆర్ అన్నారట.. కానీ?

Jr NTR-Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ల మధ్య మొదట్లో కాస్త గ్యాప్ వచ్చిందని టాలీవుడ్ లో ఒకప్పుడు టాక్ నడిచింది. జూనియర్ ఎన్టీఆర్ చిత్రసీమకు వచ్చిన కొత్తల్లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి ఎవరో తెలీదని వ్యాఖ్యానించారట. అప్పట్లో ఇది పెద్ద సంచలనం సృష్టించింది. దాంతో పాటు వీరిద్దరి మధ్య చిన్న గ్యాప్ ఉండేదని చెప్పుకొనేవారు. తర్వాత మెగాస్టార్ వ్యక్తిత్వం, మనసు తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. మెగాస్టార్ ఫ్యామిలీతో మింగిల్ అయ్యాడట.

చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తో జూనియర్ ఎన్టీఆర్ గొప్ప స్నేహం ఏర్పరచుకున్నాడు. వీరిద్దరూ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేయడంతో ఈ బంధం మరింత బలపడింది. బ్రదర్ ఫ్రం అనదర్ మదర్.. అనేలా వీరు సోదరులయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సమయంలోనూ వీరిద్దరి విన్యాసాలు ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపాయి. రాజమౌళితో కలిసి వీరిద్దరూ చేసిన చేష్టలు ఇప్పటికీ అభిమానుల కళ్ల ఎదుట కదులుతూనే ఉంటాయి.

బాక్సాఫీస్ వసూళ్లు, ఇగోలే కారణమా?

అయితే, జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో చిరంజీవి అంటే ఎందుకు పడలేదన్న విషయం ఇప్పుడు ఎవరూ ప్రస్తావనకు కూడా తేవడం లేదు. అయితే, బాక్సాఫీస్ వద్ద వసూళ్లు, ఇగో కారణంగానే అలా జరిగిందని వార్తలు వినిపించాయి. తాజాగా సినీ డిస్ట్రిబ్యూటర్ ఆవుల గిరి ఓ ఇంటర్వ్యూలో దీనిపై వివరణ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కు మొదట్లో ఓ మేనేజర్ ఉండేవాడని, అతడు చిరంజీవి గురించి ఎన్టీఆర్ వద్ద ఏవేవో లేనిపోని మాటలు చెప్పేవాడన్నారు.

అందుకే చిరంజీవిపై ఎన్టీఆర్ కు తెలియని కోపం ఏర్పడిందని క్లారిటీ ఇచ్చాడు. తర్వాతి రోజుల్లో ఎన్టీఆర్ వద్ద ఉన్న మేనేజర్ గురించి అసలు నిజాలు తెలుసుకొని.. అతన్ని తొలగించాడని గిరి తెలిపారు. ఆ తర్వాతే మెగాస్టార్ ఫ్యామిలీతో జూనియర్ ఎన్టీఆర్ బాగా కలిసిపోయారని వివరించారు డిస్ట్రిబ్యూటర్ ఆవుల గిరి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -