Karate Kalyani: ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు కరాటే కళ్యాణి నిత్యం కాంట్రవర్సీల్లో మునిగి తేలుతుంటారు. తద్వారా నిత్యం వార్తల్లో నిలవడం ఈమె ప్రత్యేకత. టీవీ షోల్లోనూ, న్యూస్ డిబేట్లలో కూడా పాల్గొంటూ కాస్త దురుసుగా ప్రవర్తిస్తుంటుంది కళ్యాణి. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న కరాటే కళ్యాణి వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోయింది. ఈమెతో పాటు ప్రముఖ కమెడియన్ కృష్ణ భగవాన్, జ్యోతి, పృథ్వీరాజ్ కూడా ఆ షోకు వచ్చారు.
ఈ షోలో మొత్తం డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయారు. అడల్ట్ కామెడీతో హల్ చల్ చేశారు. దారుణమైన బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు పేల్చారు కమెడియన్లంతా. ఇందులో కరాటే కళ్యాణి అయితే కాస్త శృతి మించింది. ఏకంగా బూతులు మాట్లాడేసింది. అది షో అని కూడా మర్చిపోయి రచ్చ చేశారు. ఈ క్రమంలో వీరు ఓ స్కిట్ను కూడా చేశారు. ఇందులో కరాటే కళ్యాణి మాట్లాడింది.
సినిమా షూటింగ్ను హియాలయాల్లో చేశామంటూ చెప్పుకొచ్చింది కరాటే కళ్యాణి. ఆ ప్రాంతంలో చాలా చలిగా ఉందని చెప్పింది. దీంతో హీరో పృథ్వీరాజ్ చలిని భరించలేకపోయాడని తెలిపింది. తర్వాత ఇద్దరు హీరోయిన్లను ఇచ్చామంటూ శృతి మించిన అడల్ట్ కామెడీ చేసింది. పృథ్వీరాజ్ చలితోపాటు దానికి కూడా తట్టుకోలేకపోతున్నాడంటూ డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పింది.
బత్తాయి మాత్రం పిండేశాడంటూ..
ఈ సినిమా కోసం తాను సర్వం సమర్పించేసుకున్నానంటూ కరాటే కళ్యాణి చెబుతుంది. తర్వాత తన జీవితాన్ని పృథ్వీ నాశనం చేశాడు బాబోయ్ అని కేకలు వేస్తుంది. అనంతరం అమ్మ దీనమ్మ బత్తాయో.. ఈ బత్తాయిని పిండేశాడుగా… అంటూ డైలాగులు చెబుతుంది. పృథ్వీరాజ్ను ఉద్దేశించి మరీ ఇంత పచ్చిగా డైలాగులు చెప్పడంతో జనం మండిపడుతున్నారు. ఇక యాంకర్ సుమ చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. సుమపై కాస్త డీసెంట్ అనే ఫీలింగ్ ఉండటంతో ఈ షోను చూస్తున్నామని, ఇలాంటి చెత్త స్కిట్లు చేస్తారా అంటూ అభిమానులు మండిపడుతున్నారు.