Kiara Advani: తెలుగులో భరత్ అనే నేను సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ కియారా అద్వానీ. తర్వాత బాలీవుడ్లోనూ తనదైన శైలిలో మూవీస్ చేస్తూ అలరిస్తోంది. ఇటీవల కాలంలో హిందీలో వరుసగా మూవీస్ చేస్తూ బాగా పాపులర్ అయ్యింది కియారా. మంచి ప్రాజెక్టులు చేతిలో పట్టుకుంటూ వరుస అవకాశాలు చేజిక్కించుకుంటోంది. ఇక ప్రకటనల్లోనూ దూసుకెళ్తోంది. మరోవైపు టాలీవుడ్లోనూ నటిస్తోంది. పాన్ ఇండియా మూవీస్ చేస్తూ తన మార్కెట్ను పెంచుకుంటోంది.
ఈ క్రమంలో కియారా గురించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. తన కెరీర్ ఆరంభంలోనే కాస్త అందాల ఆరబోతతో ఈ అమ్మడు హాట్ టాపిక్గా నిలిచింది. ఆ నేపథ్యంలో అవకాశాలు పెరిగాయి ఈ ముద్దుగుమ్మకు. సాధారణంగానే కాస్త హాట్గా ఉండేవారిని ప్రేక్షకులు ఇష్టపడుతుంటారు. హీరోయిన్లలో కొందరి డ్రెస్సింగ్ సాధారణంగానే ఉంటుంది. మరికొందరు కాస్త హాట్ అందాలను చూపిస్తూ కవ్విస్తుంటారు.
అందాల ఆరబోతలో భాగంగా కియారా కాస్త విమర్శలపాలైనట్లు చెబుతున్నారు. కియారా ఎద అందాలు చూసిన కొందరు నెటిజన్లు విపరీత చేష్టలకు దిగారు. గతంలో కియారాపై కాస్త వ్యంగ్యంగా కామెంట్లు వెలిశాయి. హీరోయిన్ నాజూగ్గా ఉందని, ఎద అందాలు పెరిగితే ఇంకా బాగుంటుందంటూ కామెంట్లు వచ్చాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్లు కలకలం రేపాయి.
ఈ కామెంట్లపై అప్పట్లో స్పందించని ఈ బ్యూటీ.. తాజాగా వాటిపై వర్కవుట్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఎద అందాలను వృద్ధి చేయడానికి కొన్ని టిప్స్ పాటించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో యువకుల మతి పోగొట్టేలా తన బాడీ షేమింగ్ చేసిన వారి వ్యాఖ్యలను తిప్పి కొట్టేలా చేసిందట. మత్తెక్కించే పోజులతో సోషల్ మీడియాను షేక్ చేస్తోందీ ముద్దుగుమ్మ. అందం రెట్టింపు చేసుకున్న నేపథ్యంలో రెమ్యునరేషన్ కూడా పెంచేస్తోందని టాక్.