Lakshmi Devi: అమ్మవారి అనుగ్రహం మీపై ఉండాలా.. ఏం చేయాలంటే?

Lakshmi Devi: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎంతో ఎదుగుదలను సాధించాలని ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అందుకే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ప్రత్యేక పూజలతో పూజిస్తూ ఉంటారు. ఇలా అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని చాలా మంది భావిస్తారు. అయితే అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే తప్పనిసరిగా అమ్మవారిని ఈ విధంగా పూజించాలని పండితులు చెబుతున్నారు.

సకల సంపదలకు అధిపతి అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ముందుగా మనం శ్రీ మహా విష్ణువును పూజించాల్సి ఉంటుంది. లక్ష్మీదేవి సాగర మధనం నుంచి ఉద్భవించిన సమయంలో మహావిష్ణువు లక్ష్మీదేవిని తన హృదయేశ్వరీగా చేసుకున్నారట. అందుకే మహా విష్ణువును పూజించిన వారికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.ఇకపోతే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా సుచి శుభ్రత నీతి నిజాయితీ ఉన్న వారి దగ్గర మాత్రమే ఉంటుందట.

 

అందుకే ప్రతిరోజు ఉదయం నిద్ర లేచి ఇంటి ముందు పాచి కసువులు ఊడ్చి శుభ్రంగా ఇంటిని కడిగి ఇంటిముందు ముగ్గులతో అలంకరించాలి. అలాగే ఇంట్లో కూడా శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా ప్రతిరోజు ఉదయం పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి ఆయన అడుగుపెడుతుందని పండితులు చెబుతున్నారు.అలాగే ఇంటికి మహిళా సిరిసంపదలనీ చెబుతారు. ఆ మహిళ మనసు నొప్పించకుండా ఆమెని ఎప్పుడు సంతోషంగా చూసుకోవడం వల్ల కూడా ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -