Lakshmi Manchu: మంచు లక్ష్మి అనుష్కపై చేసిన కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

Lakshmi Manchu: టాలీవుడ్ లో గుర్తింపు కలిగిన ఫ్యామిలీలలో మంచు ఫ్యామిలీ ఒకటి. మంచు మోహన్ బాబు టాలీవుడ్ లో ఎన్నో మరుపురాని సినిమాలు, క్యారెక్టర్లు చేసి కలెక్షన్ కింగ్ గా తనకు తాను గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడంటే బాక్సాఫీస్ వద్ద మంచు మోహన్ బాబు సినిమాలు ఆడటం లేదు కానీ ఒకప్పుడు మాత్రం ఆయన సినిమాలు రికార్డులు క్రియేట్ చేసేవి.

 

అలాంటి మంచు మోహన్ బాబు ఫ్యామిలీ నుండి ముగ్గురు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. మంచు మోహన్ బాబు కొడుకులైన మంచు విష్ణు, మంచు మనోజ్ లతో పాటు కూతురు మంచు లక్ష్మి కూడా సినిమా ఇండస్ట్రీలో ఉంది. మంచు విష్ణు ఈ మధ్యనే జిన్నా సినిమా తీయగా.. మంచు మనోజ్ చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇక మంచు లక్ష్మి విషయానికి వస్తే ఆ మధ్యన సెలబ్రెటీ టాక్ షోని నిర్వహించి.. ఇప్పుడు మాత్రం ఓటీటీలో ఓ కుకిరీ షో నిర్వహిస్తోంది.

 

సెలబ్రెటీ టాక్ షోకు ఎన్నిసార్లు ఎంతమంది గెస్టులను పిలుస్తామని కామెంట్ చేసిన మంచు లక్ష్మి.. గెస్టులు రావడం నుండి వచ్చి షూటింగ్ పూర్తి చేసుకొని వెళ్లిపోయే వరకు తనకు చాలా టెన్షన్ గా ఉండేదని ఆమె చెప్పుకొచ్చింది. అయితే తాజాగా మంచు లక్ష్మి హీరోయిన్ అనుష్క శెట్టి గురించి చేసిన కామెంట్లు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. మంచు లక్ష్మి అలా చేయడం ఏంటని అందరూ మాట్లాడుకునేలా పరిస్థితి ఏర్పడింది.

 

మంచు లక్ష్మి టాక్ షో నిర్వహించే టైంలో ఓసారి హీరోయిన్ అనుష్క శెట్టిని గెస్టుగా ఆహ్వానించిందట. అయితే తాను వస్తానని అనుష్క మాటిచ్చిందట. కానీ ‘భాగమతి’ సినిమా ప్రమోషన్స్ కోసం అని అనుష్క శెట్టి రాజమండ్రి వెళ్లగా.. ఆమె అక్కడ ఇరుక్కుపోయిందట. దీంతో రెండురోజుల పాటు ఆమె బయటకు రాలేకపోయిందట. అయితే మంచు లక్ష్మీ మాత్రం ఖంగారుపడిపోయి.. తనకు పూలు పంపిందట. అలాగే అనుష్క శెట్టి ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి ఆరా తీయడానికి కూడా ట్రై చేసిందట. కానీ అనుష్క ఎవరికీ అందుబాటులో లేదట. రెండు రోజుల తర్వాత అనుష్క తన ఫోన్ ని చెక్ చేస్తే మంచు లక్ష్మి మెసేజులు ఉన్నాయట. దాంతో అనుష్క వస్తా అని చెప్పాను కదా అని మంచు లక్ష్మితో అందట. దానికి మంచు లక్ష్మి బదులిస్తూ తాను ఖంగారుపడినట్లు చెప్పిందట.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -