Lakshmi Parvathi: ఛీ. ఛీ బాలకృష్ణని చూస్తుంటే అసహ్యంగా అనిపిస్తుంది.. లక్ష్మీపార్వతి కామెంట్స్ వైరల్!

Lakshmi Parvathi: బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్లిన విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో ఆదరణ రావడంతో మొదటి సీజన్ కి మించి ఉండేలా రెండవ సీజన్ ప్లాన్ చేశారు. అయితే ఈ షో కి మరింత ఆదరణ పెరగడం కోసం అల్లు అరవింద్ ఈసారి ఏకంగా రాజకీయ నాయకులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ బావగారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఈ వేదిక పైకి తీసుకోవచ్చారు.

ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఎప్పుడైతే విడుదలైందో ఈ ప్రోమో పై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని ఎదురు చూశారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం టెలికాస్ట్ ఆయన అనంతరం బాలకృష్ణ చంద్రబాబు నాయుడు మధ్య జరిగిన సంభాషణ విన్న ఎంతోమంది ఈ కార్యక్రమం పై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం పై ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీపార్వతి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి ఒక్క మాట పచ్చి అబద్దం అని వెల్లడించారు. 1995లో ఎన్టీఆర్ ను గద్దె దించి పార్టీని తన చేతుల్లోకి లాక్కోవడాన్ని ఎన్టీఆర్ ఎంతో బాగా సమర్ధించుకుంటున్నారని ఈయన తెలిపారు. ఎన్టీఆర్ ను గద్దె దించి తనని బయటికి పిలిపించి అందరి చేత అవమానించింది నువ్వు కాదా… నాకు పార్టీ వద్దని నువ్వు ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్న ఎన్టీఆర్ బలవంతంగా పార్టీని నీ చేతుల్లో పెట్టారా అంటూ ఈ వ్యాఖ్యలను పూర్తిగా ఖండించింది.

ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి ఎన్టీఆర్ ను గద్దె దించింది నువ్వు కదా ఇవన్నీ నిజాలనీ ఒప్పుకోమనండి అంటూ చంద్రబాబు నాయుడుకి సవాల్ విసిరారు. ఇక ఈ కార్యక్రమం చూసిన తర్వాత బాలకృష్ణ అంటేనే చాలా అసహ్యంగా ఉందని, బాలకృష్ణ నువ్వు అసలు ఎన్టీఆర్ కడుపున పుట్టావా అంటూ ఈమె తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఇక ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచారని వార్తలు వస్తూ ఒక్కో సాక్ష్యం బయటకు వస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ద్వారా బాలకృష్ణ చంద్రబాబు నాయుడు ఒకరినొకరు సమర్ధించుకుంటున్నారు అంటూ ఈమె ఈ కార్యక్రమం పై మండిపడ్డారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -