Mahesh Babu: తల్లి మరణం తర్వాత ఆ పని చేసిన మహేష్ బాబు.. ఏమైందంటే?

Mahesh Babu: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. రాజకుమారుడు సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మహేష్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి నటనలో తండ్రికి తగ్గ కొడుకుగా పేరు సంపాదించుకున్నాడు. ఇక మహేష్ బాబు అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. దాదాపు నాలుగు పదుల వయసు వచ్చినప్పటికీ ఇప్పటికీ చెక్కుచెదరని అందం మహేష్ సొంతం.

ప్రస్తుతం మహేష్ కుర్ర హీరోలతో సమానంగా సినిమా అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక మహేష్ తల్లి ఇందిరా దేవి గారు ఈ మధ్య చనిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అనారోగ్యం కారణంతో హైదరాబాదు ఏఐజీ ఆస్పత్రిలో మరణించారు. ఇక ఇందిరా దేవి గారి మరణం ఘట్టమనేని ఫ్యామిలీ ఈరోజు వరకు కూడా తీసుకోలేకపోతున్నారు. ఫ్యామిలీ అంతా కన్నీటి శోకంలో మునిగిపోయారు.

కన్నతల్లి మరణంతో మహేష్ బాబు కొన్ని రోజులుగా కుంగిపోతున్నాడు. ఇక మహేష్ భార్య నమ్రత కూడా అత్తగారి మరణాన్ని ఏమాత్రం తీసుకోలేకపోతుంది. ఇక మహేష్ తన తల్లికి తలకోరివి పెట్టి హిందూ ఆచార ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాడు. ఇక ఇందిరా దేవి గారి మరణంతో చాలామంది రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు పద్మాలయ స్టూడియోస్ కి వచ్చి కృష్ణ గారి ఫ్యామిలీని పరామర్శించారు.

కాగా ఈరోజుతో ఇందిరా దేవి గారు మరణించి ఐదు రోజులవుతుంది. ఇక హరిద్వార్ లో మహేష్ బాబు తన తల్లి ఇందిరా దేవి గారి అస్తికలు గంగా నదిలో కలిపారు. హరిద్వార్ కి మహేష్ బాబుకు తోడుగా తన తల్లి అస్తికలు కలప డానికి మహేష్ చిన్నాన ఆదిశేషగిరి రావు వెళ్లారు. ప్రస్తుతం మహేష్ కి సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఏదేమైనా మహేష్ తల్లి చనిపోవడంతో తన అభిమానులు కూడా చాలావరకు బాధను వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -