Mahesh-Namrata: నమ్రతను మహేష్ బలవంతం చేశాడా.. ఏం జరిగిందంటే?

Mahesh-Namrata: టాలీవుడ్ లో క్యూట్ కపుల్స్ లో నమ్రత, మహేష్ బాబు ల జంట కూడా ఒకటి. ఈ జంట ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వంశీ సినిమాతో వీరిద్దరి మధ్య ఏర్పడిన వీరి స్నేహం ఆ తరువాత ప్రేమగా మారి ఇద్దరు మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ప్రస్తుత కాలంలో చాలావరకు సెలబ్రిటీ జంటలు పెళ్లి అయిన ఏడాది రెండు మూడేళ్లకే విడిపోతున్నారు. కానీ పెళ్లయి కొన్ని ఏళ్లు పూర్తి అవుతున్నా ఇప్పటికీ ఎటువంటి మనస్పర్ధలు లేకుండా సంతోషంగా జీవిస్తున్నారు మహేష్ బాబు నమ్రత. విషయంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

 

కాగా నమ్రత 1993లో మిస్ ఇండియా కిరీటాన్ని కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా మహేష్ ను పెళ్లి చేసుకున్న తర్వాత న‌మ్ర‌త సినిమాలకు పూర్తిగా గుడ్ బాయ్ చెప్పేసింది. ఈ దంపతులకు గౌతమ్ సితార అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇకపోతే నమ్రత ప్రస్తుతం ఒకవైపు ఘట్టమనేని కోడలుగా బాధ్యతలు చేపడుతూనే మరోవైపు మహేష్ బాబుకు సంబంధించిన విషయాలను బిజినెస్ విషయాలను చూసుకుంటూ ఉంటుంది. అయితే న‌మ్ర‌త పెళ్లి తర్వాత సినిమాలకు దూరమవడంతో మహేష్ బలవంతం పెట్టడం వల్లే ఆమె సినిమాలకు దూరం అయ్యాడు అంటూ వార్తలు వినిపించాయి.

పెళ్లి తర్వాత ఆమె సినిమా కెరియర్ కు గుడ్ బై చెప్పడంతో చాలామంది అభిమానులు హర్ట్ అయ్యారు. మహేష్ బాబు బలవంతం చేయడం వల్లే ఆమె సినిమాలు మానేసిందని అప్పట్లో కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం కావాలన్నది తన సొంత నిర్ణయం అని. ఈ విషయంలో మహేష్ కానీ ఇతరుల సలహా, సూచనలు, తన భర్త వార్నింగ్ ఏదీ లేదని తెలిపింది. అలాగే మళ్ళీ తనకు పెళ్లి చేసుకునే అవకాశం వచ్చినా కూడా మహేష్ బాబునే చేసుకుంటానని నమ్రత అని తెలిపింది నమ్రత.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -