Manchu Vishnu: బాలీవుడ్ నటి రిచా చడ్డాపై సోషల్ మీడియాలో విమర్శలు ఆగడం లేదు. ఇటీవల ఇండియన్ ఆర్మీ విషయంలో వివాదాస్పద ట్విట్ చేసింది. ‘గాల్వాన్ హాయ్ చెబుతోంది’ అని రిచా చడ్డా చేసిన ట్విట్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయంపై సినీ ప్రముఖులు, హీరోలు ఘాటుగానే స్పందిస్తున్నారు. అయితే రిచా చడ్డా చేసిన ట్విట్పై స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది మాత్రం టాలీవుడ్ హీరో మంచు విష్ణునే.
ఈ విషయంపై యంగ్ హీరో నిఖిల్ స్పందించినా.. మొదటగా రియాక్ట్ అయింది మాత్రం మంచు విష్ణునే. ఈ ట్విట్కు మంచు విష్ణు స్పందిస్తూ.. ‘అసలు రిచా చడ్డాకు ఏమైంది? ఆ మాట అనాలని ఎలా అనుకున్నారు? సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతోంది ఆర్మీ. వారి సేవకు ప్రతిఒక్కరూ పూజించాలి. నీ లాంటి దేశభక్తి లేని భారతీయురాలిని చూసి బాధేస్తోంది.’ అని అన్నాడు. అయితే సాధారణంగా మంచు ఫ్యామిలీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. కానీ ఏ రోజు మంచు విష్ణు ఈ విషయాలపై ఏ రోజూ రియాక్ట్ అవ్వలేదు. కానీ ఈ విషయంపై రియాక్ట్ అవ్వడం అందరిలో ఆశ్చర్యానికి గురి చేసింది. అందులోనూ టాలీవుడ్ హీరో మంచు విష్ణు స్పందించడం నెటిజన్లను ఆలోచింపజేశాయి.
ఈ ట్విట్కు మంచు విష్ణు స్పందించడంపై.. ఇకపై ట్రోల్ చేసే వారు ఒకసారి ఆలోచించాలని మంచు ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు. అయితే రిచా చడ్డా వివాదాస్పద వ్యాఖ్యలపై విష్ణు కౌంటర్ ఇచ్చాడు. కానీ మిగిలిన హీరోలు ఎందుకు స్పందించడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మంచు విష్ణుతోపాటు టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ ఇష్యూపై స్పందిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వారు రెస్పాండ్ అయి ఉంటే.. ఇష్యూ వేరే లెవల్లో ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై టాలీవుడ్ హీరోలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.