Manchu Vishnu: అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు.. గరికపాటి వివాదంపై విష్ణు కామెంట్స్!

Manchu Vishnu: ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహా రావు రావు గురించి తెలియని వారంటూ ఉండరు. ప్రవచనాలు చెబుతూ గుర్తింపు పొందిన గరికపాటి ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యాడు. ఇక ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. అయితే ఈ కార్యక్రమంలో చిరంజీవి గరికపాటి మధ్య జరిగిన అనూహ్య సంఘటన తీవ్ర దుమారాన్ని రేపుతోంది.

ఈ వివాదంపై కొందరు గరికపాటికి సపోర్ట్ చేయగా మరికొందరు చిరంజీవిని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.అలయ్ బలయ్ కార్యక్రమానికి పాల్గొన్న గరికపాటి ప్రవచనాలు చెబుతున్న సమయంలో చిరంజీవి తన అభిమానులతో కలిసి ఫోటో సెషన్ ప్రారంభించాడు. దీంతో చాలా సమయం ఓపికగా ఎదురుచూసిన గరికపాటి చివరికి ఓపిక నశించింది.

చిరంజీవిగారు వెంటనే ఫోటో సెషన్ ఆపేసి ఇటువైపు రావాలి. లేకుంటే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను. నాకు ఎలాంటి మొహమాటం లేదు. చిరంజీవి ఫోటో షూట్ ఆపేయండి లేదా నాకు సెలవు ఇప్పించండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గరికపాటి ఇలా మాట్లాడటంతో కొందరు అతని ప్రవర్తనాలు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై తాజాగా మంచు విష్ణు స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ క్రమంలో మంచు విష్ణు మాట్లాడుతూ.. ” అక్కడ ఏం జరిగిందో నాకు కరెక్ట్ గా తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం. చిరంజీవి గారు ఒక స్టార్ హీరో. అలాంటి ఒక హీరో అక్కడికి వచ్చినప్పుడు అభిమానులు ఫోటోలు తీసుకోవటానికి ఎగబడతారు. తమ అభిమాన హీరో వచ్చినప్పుడు ఫోటోలు తీసుకోవటానికి అందరూ ఉత్సాహం చూపిస్తారు” అంటూ చెప్పుకొచ్చాడు.ఈ విధంగా చిరంజీవి గురించి విష్ణు చేసినటువంటి ఈ కామెంట్స్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -