Mega Multi Starrer: ఒకే మూవీలో మెగా హీరోలంతా కలిసి నటిస్తారా?

Mega Multi Starrer: టాలీవుడ్‌లో ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. మహేష్‌బాబు, విక్టరీ వెంకటేష్ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నుంచి ఈ ట్రెండ్ మొదలైంది. అయితే నిఖార్సైన మల్టీస్టారర్ సినిమాలు తక్కువగానే వచ్చాయి. ఈ ఏడాది యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కలిసి నటించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ మరోసారి మల్టీస్టారర్ సినిమాల పట్ల ఉన్న క్రేజ్‌ను బహిర్గతం చేసింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అద్భుత వసూళ్లను అందుకుంది. అటు మెగాస్టార్ ఫ్యాన్స్, ఇటు నందమూరి ఫ్యాన్స్ పోటీలు పడి ఈ సినిమాను వీక్షించి ఘనవిజయం కట్టబెట్టారు.

అయితే ఆర్.ఆర్.ఆర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ కలిసి ఆచార్య సినిమాలో నటించినా ఆ మూవీలో చెర్రీ పాత్ర అంత పెద్దదేమీ కాదు. మరోవైపు ఆ సినిమా అభిమానులను అలరించలేదు. దీంతో మెగా ఫ్యామిలీలో నిఖార్సైన మల్టీస్టారర్ మూవీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ ఫ్యామిలీలో లేని స్థాయిలో మెగా ఫ్యామిలీలో హీరోలు ఉన్నారు.వీరిలో చాలా మంది తమదైన టాలెంట్‌తో రాణిస్తున్నారు.

మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, బన్నీ, వరుణ్ తేజ్, సాయితేజ్, వైష్ణవ్ తేజ్, నాగబాబులకు మంచి డిమాండ్ ఉంది. వీరంతా కలిసి ఒక సినిమాలో నటిస్తే ఆ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే నిజమైతే ఇండస్ట్రీ హిట్ ఖాయం. అంతేకాకుండా అక్కినేని ఫ్యామిలీకి మనం సినిమా తరహాలో మెగా ఫ్యామిలీకి ఈ తరహా సినిమా మెమొరబుల్ మూవీగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

పవన్ ఒప్పుకుంటాడా?
మెగా ఫ్యామిలీ నుంచి మల్టీస్టారర్ మూవీ తీయడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఈ సినిమా చేయడానికి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది. అన్నయ్య చిరు అడిగితే పవన్ కాదనడు. కానీ పవన్ ఇప్పటికే అంగీకరించిన చాలా సినిమాలు పెండింగ్‌లో ఉన్నాయి. హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, సముద్రఖని సినిమాలు క్యూ కట్టాయి. అసలే రాజకీయాలు, సినిమాలతో బిజీబిజీగా ఉన్న పవన్ ఇప్పుడు మెగా మల్టీస్టారర్ మూవీలో నటిస్తాడా అంటే సందేహమే అని అభిమానులు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: కుప్పంలో గెలుపు కోసం చంద్రబాబు వ్యూహాలివే.. ఎదురుగాలి వీస్తోందని అలా చేస్తున్నారా?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రజా గళం పేరిట పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే గత కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు కుప్పంలో...
- Advertisement -
- Advertisement -