Chiranjeevi: గరికపాటిపై పగ తీర్చుకున్న చిరంజీవి.. ఆ పంచ్ తో?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఆన్ స్క్రీన్ లోనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లో కూడా తనదైన శైలిలో పంచులు విసురుతాడు. ఇది పలు సందర్భాల్లో స్పష్టమైంది. ఇక ఇటీవల చిరంజీవి – గరికిపాటి గారికి మధ్య కొనసాగుతున్న చిన్నపాటి మాటల యుద్దంలో ఇది మరోసారి నిరూపితం అయ్యింది. ఒక కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి, గరికిపాటి.. గరికిపాటి మాట్లాడుతున్న సమయంలో అందరూ చిరంజీవితో ఫోటోలకు ఎగబడడంతో గరికిపాటి అసహనం వ్యక్తం చేయడం.. దానికి చిరంజీవి చింతించడం.. తెలిసిన విషయమే.

అయితే ఈ విషయాన్ని మెగా అభిమానులు అంత సులభంగా వదిలి పెట్టలేదు. సోషల్ మీడియాలో, వివిధ మాధ్యమాల ద్వారా గరికిపాటి నరసింహారావు గారిని దారుణంగా విమర్శించారు. దీనికి స్పందించిన నరసింహారావు గారు జరిగిన సంఘటనపై వివరణ ఇచ్చారు. అయినప్పటికీ కొందరు చిరు ఫ్యాన్స్ డైరెక్టుగా గరికిపాటికి ఫోన్ చేసి బెదిరించడం కూడా జరిగింది.

ఈ పూర్తి సంఘటనపై స్పందించిన గరికిపాటి గారు “తాను సమావేశం యొక్క ఉద్దేశ్యం దెబ్బ తినకుండా ఉండడానికి మాత్రమే ఆ రోజు అలా మాట్లాడానని, చిరంజీవి పట్ల గానీ, మెగా అభిమానుల పట్ల గానీ తనకు ఎలాంటి ద్వేషం లేదని” ప్రకటించారు. తద్వారా ఈ విషయానికి ఇంతటితో ముగింపు పలికే ప్రయత్నం చేసారు.

ఈ క్రమంలో ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి వ్యంగ్యంగా స్పందిస్తూ.. గరికిపాటికి చురకలు అంటించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కూడా అందరు ఒక్కసారిగా చిరంజీవితో ఫోటోల కోసం రాగా.. “ఇక్కడ వారు లేరుగా?” అని గరికిపాటి గారిని ఉద్దేశిస్తూ చమత్కరించడంతో ఒక్క సారిగా వేదిక మొత్తం నవ్వులు పూసాయి. ఛాన్స్ వస్తే చిరంజీవి వదలడుగా.. అంటూ నెటిజెనులు మాట్లాడుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Kiran Kumar Vs Eswara Rao: పొలిటికల్ ట్విస్టులకు కేరాఫ్ ఆ నియోజకవర్గం.. ఆ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదో?

Kiran Kumar Vs Eswara Rao: శ్రీకాకుళం జిల్లాకు గేట్ వేగా చెప్పే ఎచ్చెర్ల నియోజకవర్గం పొలిటికల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. నిజానికి ఎచ్చెర్ల నియోజకవర్గం పొలిటికల్ కాంట్రవర్సీకి పెట్టింది...
- Advertisement -
- Advertisement -