Metro: టవల్ తో మెట్రో ఎక్కిన యువకుడు..ప్యాసింజర్లు షాక్

Metro: గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. కుర్ర వెధవలు ప్రాంక్ వీడియోల కోసం దేనికైనా తెగిస్తున్నారు. యూట్యూబ్ వ్యూస్ కోసం చేయరాని పనులు కూడా చేస్తున్నారు. రోడ్డు మీద అవ్వకో, అమ్మాయికో ప్రపోజ్ చేయటం, యువతుల్ని ముద్దులు పెట్టుకోవడం, అమ్మాయిలతో కొట్టించుకోవడం, చిల్లర బిహేవ్ చేయడం వంటివి చేస్తున్నారు. అయితే ఇదంతా స్క్రిప్టు అని చాలా మందికి తెలుసు. అయినా కూడా జనాల్ని అట్రాక్ట్ చేయడానికి ఈ ప్రాంక్ చేసేవాళ్లు ఏదేదో చేసేస్తుంటారు. ప్రస్తుతం ప్రాంక్ వీడియోల మాదిరిగానే మరో వీడియో వైరల్ అవుతోంది.

 

మోహిత్ గౌహర్ అనే వ్యక్తి టవల్ తో మెట్రో రైలు ఎక్కడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి జబ్బల బనియన్ వేసుకుని టవల్ తో మెట్రో రైలులో తిరిగాడు. వాడ్ని చూసి రైలులో ఉండేవారంతా బేవార్స్ గాడు అంటూ కామెంట్స్ చేశారు. అవన్నీ పట్టించుకోని ఆ వ్యక్తి మెట్రో రైలులో తాను అందంగా ఉన్నానో లేదోనని చూసుకున్నాడు. జుట్టు కూడా సరిచేసుకుని హీరోలా ఫోజిచ్చాడు.

మోహిత్ గౌహర్ పిల్ల చేష్టలు చూసి మెట్రోలో ఉండేవారంతా పడి పడి నవ్వుకున్నారు. ఇదంతా ప్రాంక్ వీడియో అని అనుకున్నారు. అయితే అది ప్రాంకు కాదు. అతను టవల్ తో మెట్రో రైలు ఎక్కడానికి ఓ కారణం కూడా ఉంది. తన బాత్రూంలో స్నానం చేస్తుంటే నీళ్లు అయిపోయాయని, అందుకే ఆఫీసుకు వెళ్లి స్నానం చేయాలనుకుంటున్నాని వీడియో షేర్ చేస్తూ చెప్పాడు.

 

ట్యాంక్ లో నీళ్లు అయిపోతే మాత్రం టవల్ తోనే మెట్రోలో రావాలా? ప్యాంటు, షర్టు వేసుకుని వెళ్లొచ్చు కదా అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు అయితే ఆఫీస్ లో స్నానం చేస్తా అన్నావ్ చూడు, నీ ధైర్యానికి, నీ కాన్ఫిడెన్స్ కి హ్యాట్సాఫ్ అంటూ పొగిడేస్తున్నారు. ఇలా టవల్ తో ఈ యువకుడి మెట్రోలోకి ఎవరు రానిచ్చారోనని మరికొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: టీడీపీ కంచుకోటల్లో కొత్త ఇంఛార్జ్ లను నియమిస్తున్న జగన్.. ఇది వృథా ప్రయాస అంటూ?

YS Jagan: ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి తరుణంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వ్యూహాలను అమలులోకి తీసుకువస్తున్నారు. ఇక రాజకీయ ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ఆర్ సమాధి...
- Advertisement -
- Advertisement -