Minister Roja: ఆంద్రప్రదేశ్ టూరిజం, సంస్కృతిక, యువజన శాఖ మంత్రి మంత్రి రోజా చాలా రోజుల తర్వాత చామంతి పువా అనే పాటకు స్టెప్పులేసి అదరగొట్టారు. శ్రీకాకులంలో జరిగిన ఓ కార్యక్రమానికి వచ్చి ఆమె చిరంజీతో నటించిన ముగ్గురు మొనగాళ్లు సినిమాలోని పాటకు స్టేజిపై స్టెప్పులేశారు. అందుకు సంబంధించిన వివరాలు..
శ్రీకాకులం జిల్లాలోని సంప్రాదాయం గురుకులంలో గతమూడ్రోజులుగా జరుగుతున్న మ్యూజికల్ ఈ వెంట్ ముగింపు కార్యక్రమానికి రోజా ముఖ్య అతిథిగా హాజరైంది. కార్యక్రమంలో భాగంగా మధ్యలో పాట రావడంతో రోజా పలువురితో కలిసి డ్యాన్స్ చేయడంతో అక్కడున్న వారంతా కేరింతలతో మార్మోగించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వజ్రోత్సవాల్లో భాగంగా గురుకులంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఒక ఊపి ఊపిన రోజా తర్వాత రాజకీయాల్లో అరగ్రేటం చేశారు. నగరి నియోజకవర్గం నుంచి ఆమె రెండు పర్యాలుగా ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజల మన్ననలు పొందింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థికరణలో భాగంగా మంత్రి వర్గంలో ఆమె చోటు కల్పించి టూరిజం, సంస్కృతిక,యువజన శాఖ ఆమెకు అప్పగించారు. సోమవారం జరిగిని కార్యక్రమంలో ఆమె డ్యాన్చేసిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో రోజా అభిమానులు పాత రోజులు గుర్తు చేసుకున్నారు. నాడైన నేడైన రోజా డ్యాన్స్కు తిరుగులేదని.. కామెంట్లు పెడుతూ ఆమెకు సపోర్టు చేస్తున్నారు.