Hyderabad: కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని తల్లి ఆత్మహత్య?

Hyderabad: ప్రస్తుతకాలంలో చాలామంది యువత ప్రేమ పేరుతో తల్లిదండ్రుల పరువును పోగొట్టడం మాత్రమే కాకుండా వాళ్లకు పుట్టెడు దుఃఖాన్ని మిగులుస్తున్నారు. తల్లిదండ్రులను కాదని వాళ్లు కుదిర్చిన పెళ్లి సంబంధాలు కాకుండా ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి పారిపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ప్రేమించిన యువకుడి కోసం తల్లిదండ్రులను కాదని వెళ్ళిపోయింది ఒక యువతి. దాంతో ఆ వార్తను తట్టుకోలేక తల్లి ఒక ఊహించని నిర్ణయాన్ని తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ కూకట్ పల్లిలోని జయానగర్ కాలనీలో గోనుగుంట శ్రీనివాస్, నిర్మల దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె, కొడుకు కూడా ఉన్నాడు. భర్త ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండగా భార్య ఇంటి వద్దే ఉండేది. ఇక వీరి కుమార్తె నగరంలోని ఓ కాలేజీలో చదువుకునేది. అయితే ఆ అమ్మాయి చదువుకునే క్రమంలోనే తన క్లాస్ మెట్ ని ప్రేమించింది. ఇక రాను రాను వీళ్లిద్దరూ మరింత దగ్గరై ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా తయారయ్యారు. దాంతో ఆ యువతి ఎలా అయినా ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవాలని భావించింది. ఇక అనుకున్న విధంగానే పక్కా ప్లాన్ తో ఆమె ఇటీవల ఇంట్లో నుంచి పారిపోయి లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఒక విషయం తెలుసుకున్న తల్లి నిర్మల ఒక్కసారిగా షాక్ అయింది.

 

కూతురు గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు ఇద్దరు కూడా మనోవేదనకు గురయ్యారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అలా చేయడంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. కూతురి చేసిన పనికి పరువు పోయింది అనుకున్న నిర్మల తాజాగా ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత భర్త శ్రీనివాస్ ఇంట్లోకి వచ్చి చూడగా భార్య ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించడంతో అది చూసి ఒకసారిగా షాక్ అయ్యాడు. ఇక అది చూసి కొడుకు, భర్త ఇద్దరు గుండెలు విలసేలా రోదించారు. ఇక స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -