MS Dhoni: సైలెంట్‌గా ఉండే ధోనీ.. మాస్ డ్యాన్స్‌తో అదరగొట్టాడు

MS Dhoni: మైదానంలో కూల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న మహేంద్రసింగ్ ధోని.. బయట కూడా అంతే సాఫ్ట్‌గా ఉంటాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ తర్వాత కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. దీంతో మిగతా టైంలో బిజెనెస్‌లపై దృష్టిసారించాడు. తాజాగా సినిమా నిర్మాణ రంగంలోకి కూడా ప్రవేశించాడు.

 

ఇదిలా ఉంటే.. తాజాగా ధోనీ తనలోని కొత్త టాలెంట్‌ను బయటకు తీశాడు. దుబాయ్‌లో ఫ్రెండ్ పుట్టిన రోజు కార్యక్రమంలో పాల్గొన్న ధోని అదిరిపోయే స్టెప్పులు వేశాడు. ఈ పార్టీకి ధోనితో పాటు భారత ప్లేయర్లు హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్‌లు కూడా హాజరయ్యారు. ఇక హార్దిక్, ధోని, ఇషాన్ లు తమ ఫ్రెండ్స్ తో కలిసి చేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ధోనిని డ్యాన్స్ చేయడం చూసిన అతడి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

స్టైలిష్ లుక్‌తో మాస్ స్టెప్పులు..

వైట్ షర్ట్ పైన బ్లాక్ సూట్‌తో ధోనీ స్టైలిష్‌గా కనిపించాడు. ప్రముఖ ర్యాపర్ బాద్ షా పాటలు పాడుతుంటే హార్దిక్, కృనాల్, ఇషాన్‌లతో కలిసి మహి అదిరిపోయే మాస్ స్టెప్పులు వేశాడు. దీనికి సంబంధించిన వీడియాలను ధోనీ భార్య సాక్షి సింగ్ కూడా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

 

ధోనీ ప్రస్తుతం ఫ్యామిలీతో సమయాన్ని గడపడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా టూర్లకు వెళుతున్నాడు. అలాగే టెన్నిస్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు కూడా హాజరవుతున్నాడు.

 

ఇక న్యూజిలాండ్ తో ముగిసిన టి20 సిరీస్ కు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కివీస్‌తో వన్డేలు, బంగ్లాదేశ్‌తో సిరీస్‌లకు అతనికి సెలక్టర్లు విశ్రాంతి నిచ్చారు. ఇక ఇషాన్ కిషన్ కివీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ఎంపిక కాలేదు. బంగ్లాదేశ్ తో జరిగే వన్డే సిరీస్ కు టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. వారం రోజుల్లో బంగ్లాదేశ్ పయనం కానున్నాడు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -