Nagarjuna-Balayya: టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన బాలకృష్ణ, నాగార్జున మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుందని సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో వార్తలు షికారు చేస్తున్నాయి. వారిద్దరి మధ్య అంత సఖ్యత లేదనే టాక్ వినిపిస్తోంది. గత 10 ఏళ్లుగా వీరి మధ్య ఎందుకో గ్యాప్ వచ్చిందని, వీరిద్దరూ కలుసుకునేందుకు అంతగా ఇష్టపడరని టాలీవుడ్ కోడై కూస్తోంది.
బాలయ్య, నాగ్ ఇద్దరూ ఒకరి ఇంట్లో జరిగే కార్యక్రమాలకు మరొకరు వెళ్లరని తెలుస్తోంది. అయితే వైజాగ్లో సుబ్బరామిరెడ్డి నిర్వహించిన ఓ కార్యక్రమంలో నాగ్, బాలయ్య ఇద్దరూ పాల్గొన్నప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. వేదికపై నాగ్ మాట్లాడుతూ బాలయ్యకు, తనకు మధ్య ఏదో గ్యాప్ ఉందన్న ప్రచారం జరుగుతోందని, అదంతా అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. అక్కడే పక్కనే ఉన్న బాలయ్య కూడా నవ్వుతూనే నాగ్ చేతిలో చేయి వేసి కలుసుకున్నారు.
ఆ తర్వాత అయినా వీరిద్దరు ఎక్కడా కనిపించలేదు. అయితే వీరిద్దరి మధ్య ఎంతో కొంత గ్యాప్ అయితే ఉందన్నది నిజం అని తెలుస్తోంది. బాలయ్య కూడా నాగ్తో ఎప్పుడూ కలిసేందుకు పెద్దగా ఇష్టపడుతున్నట్టూ ఆసక్తి చూపడం లేదని టాక్ వినిపిస్తోంది. అన్స్టాపబుల్ షోలో ఎంతోమంది హీరోలతో ఆయన ముచ్చటిస్తున్నా, పవన్, మహేష్ లాంటి వాళ్లను కూడా తన షోకు పిలిపించి మాట్లాడుతున్నా ఇంత వరకూ నాగ్ రాలేదు.
నాగ్ కనీసం ఈ షోకు వస్తున్నట్టు సంకేతాలు కూడా వినిపించడం లేదు. ఈ నేపథ్యంలో బాలయ్య సినిమా వీరసింహారెడ్డి సంక్రాంతికి విడుదల కానుంది. థియేటర్ల రేసులో వీరసింహాం కంటే మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య కాస్త వెనకపడిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు వీరయ్య కోసం కొందరు స్టార్ హీరోలు రంగంలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున కూడా తెరవెనక వీరయ్య థియేటర్ల కోసం చక్రం తిప్పుతున్నట్టు సమాచారం.
నాగార్జునకు సినిమా పంపిణీ రంగంలో కాస్త పట్టు ఉందనేది వాస్తవం. ఆయన తన సినిమాలను అన్నపూర్ణ ద్వారా సొంతంగా విడుదల చేసిన దాఖలాలు ఉన్నాయి. అందుకే ఏపీలో తనకు పట్టున్న కృష్ణా, గుంటూరు, వైజాగ్ ఏరియాల్లో చిరు వాల్తేరు వీరయ్యకు కాస్త ఎక్కువ థియేటర్లు వచ్చేలా నాగార్జున తన వంతు సాయం చేస్తున్నాడట. నాగ్కు చిరుతో చాలా మంచి అనుబంధం ఉందని దీన్ని బట్టి తెలుస్తోంది.