Nagarjuna: నాగార్జునను దరిద్రం వెంటాడుతోందా.. పట్టిందల్లా బూడిదేనా? 

Nagarjuna: తెలుగు సినీ ఇండస్ట్రీలో గ్రీకు వీరుడిగా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని నాగార్జునకు ఈ మధ్యన ఏమీ కలిసి రావడం లేదు. అక్కినేని నాగేశ్వర్ రావు నట వారసుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టి, మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని నాగార్జునకు ఈ మధ్యన ఎదురవుతున్న పరిస్థితులు చూస్తుంటే ఆయనను దరిద్రం వెంటాడుతుందేమో అనే అనుమానం కలగక మానదు.
అక్కినేని నాగార్జున కొడుకు అయిన అక్కినేని నాగచైతన్యకు, సమంతకు పెళ్లి జరగగా.. వారు గతేడాది విడిపోయారు. ఎంతో అన్యోన్యంగా ఉన్నారని అనుకున్న నాగచైతన్య మరియు సమంతలు ఏకంగా విడాకులు తీసుకోవడం అందరికీ షాకిచ్చింది. అయితే ఈ విషయంలో నాగార్జునకు ఎక్కువ నష్టం కలిగింది. తన కొడుకు జీవితం ఇలా అయిపోయిందే అనే బాధ ఉండిపోయింది.
ఇక నాగార్జున జీవితంలో అలా జరుగుతుంటే.. రీల్ లైఫ్ లో పరిస్థితి దారుణంగా ఉంది. బిగ్ బాస్ రియాల్టీకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున.. సీజన్ 6ని ఎన్ని ప్రయత్నాలు చేసినా హిట్ చేయలేకపోతున్నాడు. గత సీజన్లతో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ 6 రేటింగ్ అతి దారుణంగా ఉండటంతో డిస్నీ హాట్ స్టార్ కూడా తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది.
అటు నాగార్జున సినిమాలు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోతోంది. ఆయన చేసిన సినిమాలు ఏవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఆడటం లేదు. నాగార్జున హిట్ చూసి చాలా సంవత్సరాలే అయింది. రాజుగారి గది-2, ఆఫీసర్, దేవదాస్, మన్మధుడు2, వైల్డ్ డాగ్, బంగార్రాజు, ది ఘోస్ట్ లు వరుసగా ప్లాఫ్ అయ్యాయి. ఇక బ్రహ్మాస్త్రం సినిమాలో నాగార్జున కనిపించినా, ఆ క్రెడిట్ రణ్ వీర్ ఖాతాలోకి వెళ్లిపోయింది. మొత్తానికి నాగార్జునను దరిద్రం వెంటాడుతోందని, పట్టిందల్లా బూడిదే అవుతోందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -