Balakrishna-Nagarjuna: బాలయ్యను టార్గెట్ చేసి పగ తీర్చుకున్న నాగ్.. ఏమైందంటే?

Balakrishna-Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కుటుంబాల్లో అక్కినేని వారి కుటుంబం, నందమూరి వారి కుటుంబాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఈ కుటుంబాలకు చెందిన వారసత్వాన్ని రెండో తరంలో అక్కినేని నాగార్జున, నందమూరి బాలయ్య కొనసాగిస్తుండటం తెలిసిందే. వీరిద్దరు తెలుగులో టాప్ హీరోలుగా దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలడం కూడా తెలిసిందే.

నందమూరి బాలయయ్య ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క టాక్ షోని నిర్వహిస్తుండటం తెలిసిందే. ఓటీటీ వేదిక ‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్’ పేరుతో నిర్వహిస్తున్న టాక్ షోకు తెలుగు జనాల్లో ఎంతో విపరీతమైన క్రేజ్ ఉండటం తెలిసిందే. కాగా తాజాగా బాలయ్య, అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. బాలయ్య చేస్తున్న టాక్ షోకు రమ్మని నాగార్జునకు ఆహ్వానం పంపిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

తాజాగా బాలయ్య షోకు విక్టరి వెంకటేష్ తో పాటు అక్కినేని నాగార్జునను రావాలని ఆహా నుండి ఆహ్వానం అందిందట. అయితే వెంకటేష్ షూటింగ్ ఉందని సమాధానం చెప్పాడని తెలుస్తోంది. కానీ నాగార్జున మాత్రం మొహమాటం లేకుండా రాను అని చెప్పాడనే వార్త అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ‘ఆహా’లో వస్తున్న బాలయ్య ‘అన్ స్టాపబుల్’ టాక్ షోకు నాగార్జున్ మొహమాటం లేకుండా నో చెప్పడానికి… బాలయ్యకు, నాగార్జునకు మధ్య గతంలో జరిగిన ఘటనే కారణం అని తెలుస్తోంది.

గతంలో అక్కినేని నాగేశ్వర్ రావు ఉన్నప్పుడు ఆయన ఓ కార్యక్రమాన్ని నిర్వహించారట. అప్పుడు బాలయ్య పేరును రెండో లిస్ట్ లో పెట్టాడట. దాంతో బాలయ్యకు కోపం వచ్చి ఆ కార్యక్రమానికి హాజరు కాలేదని, ఏఎన్నార్ చనిపోయినప్పుడు కూడా ఆయన హాజరు కాకపోవడానికి అదే కారణం అని సమాచారం. ఇక అప్పటి నుండి ఇద్దరికి పొసగటం లేదని, అందుకే తాజాగా బాలయ్య షోకి నాగార్జునకు ఆహ్వానం అందితే ముఖం మీదే నో అని చెప్పడానికి ఇదే కారణం అని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -