Namrata: మహేష్ కంటే ముందు నమ్రత వాళ్లను ప్రేమించిందా?

Namrata: సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన మహేష్ బాబు.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. నటనలో చైల్డ్ ఆర్టిస్టుగానే ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. తర్వాత హీరోగా తనదైన ముద్ర వేశారు. మహేష్ బాబు పేరు చెబితే ముందుగా గుర్తొచ్చే సినిమా పోకిరి. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా మహేష్ బాబు కెరీర్‌లో నిలిచిపోతుంది పోకిరి మూవీ.

హీరోగా మంచి పీక్‌లో ఉన్న టైమ్ లో మహేష్ బాబు.. హీరోయిన్ నమ్రతను పెళ్లాడాడు. టాలీవుడ్ లో చాలా మంది ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. మహేష్, నమ్రతల జంట బాగా పాపులర్ అయ్యారు. ఇప్పటికీ ఎలాంటి మనస్పర్ధలు లేకుండా సంతోషంగా జీవితం గడుపుతున్నారు. వీరిద్దరూ సుమారు ఐదేళ్లపాటు ప్రేమించుకున్నాక 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తర్వాత గౌతమ్, సితార పిల్లలు కలిగారు.

టాలీవుడ్ లో మోస్ట్ అందగాడైనప్పటికీ మహేష్ బాబు హీరోయిన్లతో చెట్టపట్టాలేసుకొని తిరిగింది లేదు. తనకంటూ ప్రత్యేక శైలితో చాలా డీసెంట్ గా ఉంటాడనే పేరు తెచ్చుకున్నాడు. మహేష్ భార్య నమ్రత ముంబై అమ్మాయి. చాలా కలుపుగోలు మనిషిగా ఉండేది. మహేష్‌తో బంధానికి ముందు అనేక రిలేషన్ షిప్స్ ఉన్నప్పటికీ మహేష్ బాబుతో పెళ్లయ్యాక ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. మహేష్ ఫ్యామిలీలో చక్కగా కలిసిపోయింది.

మొదట్లో మోడలింగ్..

మహేష్ భార్య నమ్రత కెరీర్ మొదట్లో మోడలింగ్ చేసేది. తర్వాత మిస్ ఇండియాగా ఎదిగింది. అనంతరం మిస్ యూనివర్స్ పీజెంట్ లో కూడా పాల్గొని ఆరో స్థానంలో నిలిచింది. బాలీవుడ్ సినిమాల్లో నటించే క్రమంలో రెస్టారెంట్ ఓనర్ అయిన దీపక్ శెట్టితో ప్రేమలో పడిందట. వీరిద్దరూ రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారనే టాక్ అప్పట్లో హల్ చల్ చేసింది. తర్వాత బ్రేకప్ అయ్యింది. అనంతరం మహేష్ మంజ్రేకర్ తో క్లోజ్ గా మెలిగిందట. అనతరం మహేష్ బాబుతో కలిని నటించే క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక మహేష్ ను పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -