NTR: నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ ను చేరదీయడానికి అసలు కారణమిదా?

NTR: ఇప్పుడు లోకమంతా డబ్బే ప్రధానమైపోయింది. డబ్బు ఎంత ఉందన్న దాన్ని బట్టే విలువలు, పరపతి గంట్రా అన్నీ వస్తాయి. దీన్ని కొందరు నమ్మరు. కానీ ఇదే నిజం. ఇటు ఇండస్ట్రీ వైపు చూసుకున్న అంతే. స్టార్ డమ్ ఎంతో ముఖ్యం. దాన్ని బట్టే గురు అంతా వ్యాల్యూవ్ ఇచ్చేది. ఇప్పుడు మనం ఓ ఇద్దరి వ్యక్తుల గురించి మాట్లాడుదాం. వారెవరో కాదు ఎన్టీఆర్ అండ్ తారకరత్న.

 

దివంగత హరికృష్ణ తనయుడు ఎన్టీఆర్.జానకిరామ్, కల్యాణ్ రామ్, సుహాసిని, హరికృష్ణ మొదటి భార్య పిల్లలు.ఎన్టీఆర్ ఒక్కడు హరికృష్ణ రెండో భార్య తనయుడు.ఈ ఒక్క అంశమే తారక్ ను నందమూరి కుటుంబం నుంచి వేరుచేసింది. ఏళ్ల పాటు ఈ హీరోను నందమూరి కుటుంబ సభ్యులకు దూరం చేసింది.

ఎప్పుడైతే ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగాడో, లెక్కలేంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడో అప్పుడిక నందమూరి కుటుంబం కూడా ఏం చేయలేని స్థితికి వచ్చింది.తప్పనిసరి పరిస్థితుల మధ్య తమ కుటుంబంలో ఒకడిగా ఎన్టీఆర్ ను కలుపుకోవాల్సి వచ్చింది.ఎన్టీఆర్ ను అలా నందమూరి కుటుంబ సభ్యుడిగా మార్చడం వెనక అప్పట్లో చంద్రబాబు రాజకీయ కోణం కూడా ఉందంటారు.

 

ఇక తారకరత్న పరిస్థితి ఎన్టీఆర్ కు పూర్తిగా భిన్నం. అతడు పూర్తిగా నందమూరి కుటుంబ సభ్యుడే. కాకపోతే అది పెళ్లికి ముందు. ఎప్పుడైతే అలేఖ్యను పెళ్లి చేసుకున్నాడో, అప్పుడిక ఆయన నందమూరి సభ్యుడు కాలేకపోయాడు. కుటుంబం మొత్తం ఆయన్ను పక్కనపెట్టింది. దానికితోడు స్టార్ డమ్ లేకపోవడం తారకరత్నకు మరింత ఇబ్బందికరంగా మారింది.

 

తారకరత్న కన్నుమూసిన తర్వాతే అతడు ఎదుర్కొన్న కుటుంబ వివక్ష చాలామందికి తెలిసొచ్చింది. ఇక రీసెంట్ గా భార్య అలేఖ్య పెట్టిన పోస్టుతో మరిన్ని విషయాలు పరోక్షంగా వెలుగులోకి వచ్చాయి. పెళ్లి చేసుకున్న కొత్తలో తారకరత్నకు అండగా ఉన్న, కొంతమంది నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఆ తర్వాత ముఖం చాటేసిన విషయం అలేఖ్య పోస్టుతో బహిర్గతమైంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -