Karate Kalyani: ఇటీవల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా హాట్ టాపిక్ గా నిలుస్తున్న పేర్లలో కరాటే కళ్యాణి పేరు కూడా ఒకటి. తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది కరాటే కళ్యాణి. మొన్నటి వరకు మా అసోసియేషన్ సస్పెండ్ చేసిందని వార్తల్లో నిలిచిన కరాటే కళ్యాణి తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి ఏకంగా తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాకు ప్రాణ హాని ఉంది.
ఈ మధ్యనే నా కారు రెండు టైర్లను గుర్తు తెలియని వ్యక్తులు కోసేశారు. తెలియకుండా నేను ప్రయాణించాను. ఒక చిన్న రోడ్డులో వెళ్ళేప్పుడు ఆ కారు టైర్లు పేలిపోయాయి. అదే హైవే మీది ప్రయాణించి ఉంటే నాపరిస్థితి వేరేలా ఉండేది. ఈ మధ్యన హిందుత్వ వాదులతో కలసి కార్లో ఏదో గుడి దగ్గర గొడవ జరుగుతుంది అంటే నా కార్ లో వెళ్లాను. అటు నుంచి వస్తుంటేనే ఇది జరిగింది అని ఆమె తెలిపింది. కారు చెక్ చేసి.. టైరును పరీక్షించిన మెకానిక్ లు ముందే ఎవరో కార్ టైరును కొంచెం కోసేశారని తెలిపారు అని చెప్పుకొచ్చింది కళ్యాణి.
నా మీద కోపంతోనే ఎవరో కావాలనే అలా చేశారు. నాకు ప్రాణ హాని ఉంది అంటూ ఆరోపణలు చేసింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా ఇంకొందరు మన ఎన్టీఆర్ విగ్రహం విషయంలో అభ్యంతరం వ్యక్తం చేశారు కదా అది దృష్టిలో ఉంచుకుని ఇలా చేస్తున్నారు ఏమో అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.