Nara Devaansh: నారా దేవాన్ష్ గ్రేట్.. అన్ని లక్షల రూపాయల విరాళం ఇచ్చారా?

Nara Devaansh: టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ నారా బ్రాహ్మణిల తనయుడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంకు భారీ విరాళం అందించారు.ఒక రోజు అన్నప్రసాద వితరణకు 33 లక్షల విరాళాన్ని నారా లోకేష్-బ్రాహ్మణి తరపున కుటుంబసభ్యులు టీటీడీ అధికారులకు అందజేశారు.

 

అయితే ప్రతి సంవత్సరం పుట్టిన రోజున అన్నప్రసాద వితరణకు విరాళం ఇవ్వడం ఆ కుటుంబానికి ఆనవాయితీగా వస్తోంది. నారా దేవాన్ష్ పేరిట విరాళం ఇచ్చిన నేపథ్యంలో ఆ విషయాన్ని తెలుపుతూ తిరుమలలో శ్రీవారి ఆలయ పరిసరాల్లోని డిస్‌ప్లే బోర్డుల్లో ప్రదర్శించారు.

తిరుమల శ్రీవారి భక్తులు తమ కుటుంబసభ్యుల్లో ఎవరిదైనా పుట్టినరోజు లేదా ప్రత్యేకమైన రోజుల్లో టీటీడీ అన్న ప్రసాద వితరణకు ఇలా విరాళాలు ఇస్తుంటారు. కొందరు భక్తులు అన్న ప్రసాదానికి విరాళాన్ని ఇచ్చి తమ మొక్కుల్ని కూడా చెల్లించుకుంటారు. చంద్రబాబు కుటుంబం గతంలో స్వయంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొంది.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -