Naresh: కృష్ణ అస్తికలను కలపడానికి వెళ్లినప్పుడు నరేష్‎ను అందుకే తీసుకెళ్లలేదా?

Naresh: టాలీవుడ్ లో అలనాటి హీరోల్లో తిరుగులేని సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో కృష్ణ. అనారోగ్యంతో ఆయన ఈ మధ్యనే కాలం చేయడం తెలిసిందే. అయితే కృష్ణ మరణించిన విషయం తెలుసుకున్న చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయన పార్థివ దేహం చూడటానికి, అంతిమ యాత్రలో పాల్గొనడానికి వచ్చారు.

 

అందరి హృదయాలను ద్రవింపజేస్తూ కృష్ణ అంతిమ యాత్ర ముగియగా.. కృష్ణ పార్థివ దేహం వద్ద నరేష్ చేసిన హడావిడి మీద ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కృష్ణ మరణిస్తే నరేష్ హుందాగా ప్రవర్తించలేదని, మరీ దారుణంగా ప్రవర్తించాడనే టాక్ నడుస్తోంది. పవిత్రా లోకేష్ ను కుటుంబ సభ్యులతో పాటు కూర్చోబెట్టడం, వచ్చిన వారిని ఆమెకు పరిచయం చేయడం లాంటివి చేశాడట.

 

అలాగే కృష్ణ పార్ధివ దేహం చూడటానికి వచ్చిన వీఐపీలకు ఎదురెళ్లి స్వాగతం పలకడం చూసిన సినీ, రాజకీయ ప్రముఖులు ఆశ్చర్యపోయారట. అదేదో శుభకార్యానికి వచ్చినట్లు నరేష్ ఎదురు రావడం ఏంటని అందరూ గుసగుసలాడుకున్నారట. తెలంగాణ సీఎం కేసీఆర్.. మహేష్ బాబుతో పాటు పలువురిని పరామర్శిస్తుంటే నరేష్ ఏదో చెప్పడం, దానికి కేసీఆర్ సైలెంట్ గా ఉండు అన్నట్లు అడ్డు చెప్పిన వీడియోలు వైరల్ అయ్యాయి.

 

కృష్ణ మరణం అనంతరం ఆయన కొడుకుగా ఎంతో హుందాగా వ్యవహరించాల్సిన నరేష్ దారుణంగా ప్రవర్తించాడని, గతంలో కృష్ణ సతీమణి విజయ నిర్మల (నరేష్ అమ్మ) చనిపోయినప్పుడు కూడా ఇలానే అతి చేశాడని అందరూ తిట్టిపోశారట. తాజాగా అతడు చేసిన అతిని గమనించిన మహేష్ బాబు.. కృష్ణ అస్తికలను గంగలో కలపడానికి వెళ్లినప్పుడు నరేష్ ను అందుకే వెంట తీసుకెళ్లలేదట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -