Naresh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ పేర్లు కూడా ఒకటి. గత కొంతకాలంగా ఈ జంట పేర్లు మారుమోగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా వీరి గురించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. వీరి విషయాలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ జంట పెళ్లి కాకుండానే ప్రస్తుతం సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా వీరిద్దరూ కలిసి నటించిన సినిమా మళ్లీ పెళ్లి.
ఈ మళ్లీ పెళ్లి అనే సినిమాతో తెరపైకి రాబోతున్న ఈ జంట ఎప్పటికప్పుడు ఈ సినిమా ఇంటర్వ్యూలో పాల్గొంటూ సినిమాపై హైప్ పెంచడంతోపాటు వారి జీవితంలోని పర్సనల్ విషయాలపై ఆసక్తికరమైన కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ప్రెస్ మీట్ లు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు పవిత్ర, నరేష్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఈ మూవీ కన్నడ, తెలుగు భాషల్లో మే 26న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా మళ్లీ పెళ్లి సినిమా ఇంటర్వ్యూలో భాగంగా పెళ్లి, పిల్లల గురించి ప్రశ్న అడగగా నరేష్ బోల్డ్ కామెంట్స్ చేశారు.
పెళ్లయిన తర్వాత పిల్లల్ని కంటారా? అని నరేష్ను ప్రశ్నించగా.. ఇప్పటివరకు పిల్లల గురించి ఆలోచించలేదని,కానీ పెళ్లయిన తర్వాత ఆ విషయం గురించి ఆలోచిస్తామని. స్వచ్ఛమైన ప్రేమకు వయసుతో సంబంధం లేదు. అది పిల్లల విషయంలోనూ వర్తిస్తుందది అంటూ బోల్డ్ గా కామెంట్స్ చేశారు. అలాగే పెళ్లి తర్వాత పిల్లల్ని కూడా కనాలనిపిస్తే కంటాం అంటు నరేష్ చెప్పుకువచ్చాడు. దాంతో నరేష్ చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.