Naresh: పిల్లలపై షాకింగ్ కామెంట్స్ చేసిన నరేష్.. ఏమన్నారంటే?

Naresh: మూవీ సెలబ్రిటీల మ్యారేజ్ లైఫ్​ గురించి అందరికీ ఓ అపోహ ఉంది. ఇష్టం వచ్చినట్లు పెళ్లిళ్లు చేసుకుంటారని చాలా మంది సినీ ప్రముఖులను అందరూ విమర్శిస్తుంటారు. నచ్చితే పెళ్లి చేసుకుంటారు, ఒకవేళ నచ్చకపోతే అంతే సులువుగా విడాకులు ఇచ్చేస్తారని పెదవి విరవడం పరిపాటిగానే చెప్పాలి. ఇప్పుడు దీన్ని మరోమారు నిజం చేసేశారు సీనియర్ హీరో, ప్రముఖ ఆర్టిస్ట్ నరేష్. ఇటీవల ఆయన నాలుగో పెళ్లి వార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే.

తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న నటి పవిత్రను నరేష్ పెళ్లాడనున్నారన్న వార్తలు కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీళ్లిద్దరు కలసి బెంగళూరులోని ఓ హోటల్ లో ఉన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. వీళ్లిద్దరూ కలసి ఉన్న సమయంలో అక్కడికి నరేష్ మూడో భార్య పోలీసులతో సహా వచ్చి హల్ చల్ చేయడం దిగడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

ఒక్క వీడియోతో అన్నీ పటాపంచలు
అందరూ ఊహించినట్లే పవిత్ర–నరేష్ కలసిపోయారు. న్యూ ఇయర్ సందర్భంగా పవిత్రను తాను కిస్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో నరేష్ పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఒక్క వీడియోతో తమ బంధాన్ని అందరికీ వెల్లడించేశారీ జంట. ఇదిలాఉంటే.. నరేష్ కు తన ముగ్గురు భార్యలతో ముగ్గురు కుమారులు ఉన్నారు. మొదటి భార్యతో ఇద్దరు కొడుకులు, మూడో భార్యకు ఓ కుమారుడు ఉన్నాడు.

తాను మంచి భర్తను కాకపోవచ్చును కానీ, మంచి తండ్రిని అని నరేష్ అంటున్నారు. తాను ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా.. పిల్లలకు మాత్రం మంచి తండ్రినని గట్టిగా చెబుతున్నారాయన. తన ముగ్గురు కొడుకుల ప్రతి అవసరాన్ని తెలుసుకుంటూ, ఎప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. వాళ్ల ప్రతి అవసరాన్ని తీరుస్తానన్నారు. రెండో వివాహం చేసుకున్నాక మొదటి భార్య పిల్లల కోసం కేసు వేశానని, అందువల్ల నవీన్ ను చిన్నతనం నుంచి తానే పెంచానని నరేష్ పేర్కొన్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack Case: గులకరాయి కేసులో ఏ2 ఎవరు జగన్ సార్.. ఆ నేతలను ఇరికించే కుట్ర జరుగుతోందా?

CM Jagan Stone Attack Case: సీఎం జగన్మోహన్ రెడ్డి పై జరిగినటువంటి రాయి దాడి ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనలో భాగంగా వడ్డెర్ల సతీష్ అలియాస్ సత్తి...
- Advertisement -
- Advertisement -