Malli Pelli: మళ్లీ పెళ్లిపై నరేష్ మూడో భార్య పిటిషన్.. తెలివిగా ప్లాన్ చేశారంటూ?

Malli Pelli: నరేష్ పవిత్ర లోకేష్ జట్టుగా నటిస్తున్న మళ్లీ పెళ్లి సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్ర ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఊహించని విధంగా దెబ్బ కొట్టింది.నరేష్ జీవిత కథ ఆధారంగా మళ్లీ పెళ్లి అనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారని ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ టీజర్ చూస్తే అందరికీ అర్థమవుతుంది.

 

ఇక ఈ సినిమాలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పాత్ర కూడా ఉంది ఈ పాత్రలో నటి వనిత విజయ్ కుమార్ నటిస్తున్నారు.అయితే ఈ సినిమా మే 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నరేష్ పవిత్ర ఇద్దరు చట్టాపట్టాలేసుకుని పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ సినిమా విడుదలకు ఒకరోజు సమయం ఉందనగా రమ్య రఘుపతి ఈ సినిమాని విడుదల చేయకూడదు అంటూ కోర్టును ఆశ్రయించారు.

 

ఈ సినిమాలో తన పాత్ర ఉందని అయితే తన పాత్ర తనకు పరువు భంగం కలిగించేలా చిత్రీకరించారు అంటూ ఈమె ఈ సినిమా విడుదలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కూకట్ పల్లి లోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. ఇలా ఈ సినిమాని విడుదల చేయకూడదు అంటూ ఈమె వేసిన ఈ పిటిషన్ అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది.

 

ఇలా రమ్య రఘుపతి ఈ విధంగా సినిమా విడుదల చివరి క్షణాలలో నరేష్ పై భారీగా రివెంజ్ తీర్చుకుందని తెలుస్తుంది. ఇలా ఈమె కోర్టుకు వెళ్లడంతో ఈ విషయంపై కోర్టు ఎలాంటి తీర్పు చెబుతుందో తెలియాల్సి ఉంది. అయితే ఈ విషయంపై ఇంకా ఇప్పటివరకు నరేష్ పవిత్ర లోకేష్ మాత్రం స్పందించలేదు. మరి ఈ విషయంపై నరేష్ ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -