Nayanthara: అభిమానికి వార్నింగ్ ఇచ్చిన నయనతార.. ఏం జరిగిందంటే?

Nayanthara: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకరు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ నటిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార తాజాగా తన కులదైవాన్ని సందర్శించి ప్రత్యేకంగా పూజలు చేశారు. గత ఎడారి తన ప్రియుడు విగ్నేష్ శివన్ నుపెళ్లి చేసుకున్నటువంటి నయనతార పెళ్లయిన నాలుగు నెలలకే పండంటి కవల పిల్లలకు సరోగసి ద్వారా జన్మను ఇచ్చారు.

పిల్లలు పుట్టిన తర్వాత ఎంతో బిజీగా మారిపోయినటువంటి ఈమె మొదటిసారి తమ కుల దైవాన్ని దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే కుంభకోణం సమీపంలోని మెళవత్తూర్ గ్రామంలోని కామాక్షి అమ్మవారి ఆలయానికి వీరిద్దరూ వచ్చారు. ఇలా నయనతార విగ్నేష్ దంపతులు తమ గ్రామానికి చేరుకున్నారని తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఇక వారిని కంట్రోల్ చేయడం నయనతార టీమ్ కు సాధ్యపడలేదని చెప్పాలి.

ఇక నయనతార దంపతులు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తున్న నేపథ్యంలో బయట అభిమానులు పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నయనతార ఐదు నిమిషాల పాటు వెయిట్ చేయండి పూజ పూర్తి అవుతుంది మేము కూడా దర్శనానికే వచ్చాము అంటూ అభిమానుల పై మండిపడ్డారు. నయనతార బయటకు వస్తున్న నేపథ్యంలో ఓ అభిమాని సెల్ఫీ వీడియో తీసుకోవడం కోసం ప్రయత్నం చేశారు.

ఇక ఈ విషయాన్ని గమనించిన నయనతార వీడియో తీస్తే ఫోన్ పగులుద్ది అంటూ సదరు అభిమానికి వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈమె గుడి బయటకు రావడంతో ఓ మహిళ అభిమాని వెనుక నుంచి ఆమె భుజంపై చేయి వేయడానికి ప్రయత్నం చేశారు. ఇలా తన భుజంపై చేయి వేయడంతో ఒకింత నయనతార ఆగ్రహానికి గురయ్యారు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -