Nayanthara: యాంకర్గా కెరీర్ని ప్రారంభించి దక్షణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న నటి నయనతార. మొదట తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నయనతార తక్కువ కాలంలోనే దక్షణాదిలోని నాలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె అందం అభినయంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. ఒక్కప్పుడు లేడి ఓరియెంటెడ్ సినిమాలకు విజయశాంతి కేర్ అఫ్ అడ్రెస్గా ఉండగా.. ప్రస్తుతం ఇండస్ట్రీలో నయనతార లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ అఫ్ అడ్రెస్గా మారారు. ఆమె హీరోలతో సమానంగా నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఒకప్పుడు వరుస ప్లాప్లను ఎదుర్కొన్న ఈ అమ్మడు ఛాలెంజింగ్ కథలను ఎంపిక చేసుకుంటూ.. వరుసగా సక్సెస్ చిత్రాలల్లో నటిస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తుంది.
నయనతార హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ.. ప్రముఖ హీరోలతో లవ్ బ్రేక్ అప్లతో వార్తలో నిలిచింది. ఈ భామ ముందుగా తమిళ స్టార్ హీరో శింబుతో ప్రేమలో పడింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు, కలిసి ఉన్నట్లు అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఏమైందో తెలియదు వీరు కొద్దిరోజులకే విడిపోయారు. ఆ తరువాత నయనతార తన సినీ కెరీర్పై ఫోకస్ పెడుతున్న సమయంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవాతో ప్రేమలో పడింది.
ఇక ప్రభుదేవా-నయనతారలు మధ్య లవ్ ట్రాక్ నడిచింది. అప్పట్లో పెళ్లి చేసుకోవాలని కూడా వార్తలు వచ్చాయి. కానీ అప్పటికే ప్రభుదేవాకు పెళ్ళై, పిల్లలు కూడా ఉన్నారు. దీంతో ప్రభుదేవా మొదటి భార్య మీడియా ముందుకు వచ్చి వారిద్దరిపై కేసు వేయడంతో కొన్ని రోజుల పాటు కోర్టుల చుట్టూ తిరిగారు. చివరకు వీరిద్దరూ కూడా బ్రేకప్ చేసుకున్నారు. ఇద్దరితో బ్రేకప్ చేసుకున్న నయనతార తన కెరీర్పై దృష్టి సారించి స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగింది. హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది. అయితే వీరి ప్రేమ మాత్రం పెళ్లి పీటలెక్కింది. వీరిద్దరి వివాహం సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా ఈ జంట సరోగసి ద్వారా కవల పిల్లలకి జన్మనిచ్చారు. ప్రస్తుతం వీరిద్దరు సరోగసి కేసులో కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.