Nayanthara: సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారిలో నయనతార ఒకరు. ఇప్పటివరకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని అందరూ స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించింది. నటనలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ భామ.. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. స్టార్ హీరోలకు పోటీగా సినిమా చేస్తూ.. స్టోరీలు ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తోంది. కామెడీ, ఫ్యామిలీ, హర్రర్, యాక్షన్ సినిమాలకు కేరాఫ్గా నిలుస్తోంది. ప్రస్తుతం ఆమె హీరోయిన్గా నటించిన చిత్రం ‘కనెక్ట్’.
హర్రర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం.. షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్ర బృందం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంటోంది. అయితే ఇప్పటివరకు ఏ ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొనని నయన్.. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్కు అటెండ్ అయింది. దానికి కారణం నయన్ భర్త బ్యానర్లో ఈ సినిమా రావడమే. ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా.. నయన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్లో ఆ ఒక్క హీరో మగాడేనని, మిగిలిన హీరోలకు కోపం తెప్పించేలా మాట్లాడింది. దీంతో మిగిలిన హీరోల ఫ్యాన్స్ నయన్పై మండిపడుతున్నారు. నయన్ అంతలా పొగిడేసిన హీరో ఎవరని అనుకుంటున్నారా?. అతనే యంగ్ టైగర్ ఎన్టీఆర్.
ఈ సందర్భంగా నయనతార మాట్లాడుతూ.. ‘టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్కు స్పెషల్ ఇమేజ్, క్రేజ్ ఉంది. యాక్టింగ్ ఇరగదీస్తారు. ఎవరైనా డ్యాన్స్ చేసేటప్పుడు చాలా సార్లు రిహార్సల్స్ చేస్తారు. కానీ ఎన్టీఆర్ మాత్రం డైరెక్ట్ షాట్కి వెళ్లిపోతాడు. కష్టమైన స్టెప్పులకు కూడా సింపుల్గా చేసేస్తారు. కొరియోగ్రాఫర్ స్టెప్పులు నేర్పించేటప్పుడు కేవలం కళ్లతోనే చూసి.. రంగంలోకి దిగేస్తారు. తారక్తో సినిమా అంటేనే మాకు టెన్షన్ మొదలవుతుంది. మేం రిహార్సల్స్ చేయాలి. తారక్తో పోటీగా డ్యాన్స్ చేయడానికి ట్రై చేసే వాళ్లం. కానీ తారక్ను ఓడించలేకపోయాం. అదుర్స్ సినిమాలోని ఒక్కొక్క స్టెప్పులు చూస్తే నా మతి పోయేది. తారక్ లాంటి డ్యాన్సర్ని ఎక్కడా చూడలేదు.’ అని చెప్పుకొచ్చింది.