ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబల్ అవార్డు లభించడమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు కూడా వరించింది. దీంతో ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయి గ్లోబల్ స్టార్స్ గా గుర్తింపు పొందారు. ఈ క్రమంలో రామ్ చరణ్ తన దూకుడు బాగా పెంచేశాడు. ఇటీవల తరచూ విదేశాలకు వెళుతున్న రామ్ చరణ్ విదేశాలలో ఇంటర్వ్యూలలో పాల్గొంటూ పబ్లిసిటీ పెంచుకుంటున్నారు.
తాజగా ముంబాయిలో ఒకటికి రెండు ఏజెన్సీలను అపాయింట్ చేసి మరీ స్టోరీలు, ఫొటోలు ఒకదాని వెంట మరోటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. ఇలా ఉదయం లేస్తే వార్త..ఫొటో…మళ్లీ మధ్యాహ్నం.. సాయంత్రం ఇలా పబ్లిసిటీ పెంచుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఫోటో షేర్ చేశాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో రామ్ చరణ్ స్టయిల్ గా టేబుల్ మీద కూర్చుని ఉండగా… పక్కనే టేబుల్ మీద నాటు నాటు పాటకి వచ్చిన గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డులు వున్నాయి.
ఇక కింద నేల మీద చరణ్ కాళ్ల దగ్గర ఓ పక్కన ఫిల్మ్ ఫేర్ అవార్డులు, మరోపక్కన గౌరవ మైన నందీ అవార్డులు పెట్టారు. అయితే ఆస్కార్ అవార్డులు తన పక్కన పెట్టుకొని మన దేశంలో ఇచ్చిన నంది అవార్డును కాళ్ళ దగ్గర పెట్టి ఆ అవార్డుపట్ల తన చిన్న చూపు బయట పెట్టాడు.అంతే కాదు మన మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్ లు కూడా కాళ్ల దగ్గర పడేసారు. అంతే కాకుండా చిరంజీవి పూజించే అంజనీ పుత్రుడి బొమ్మ వున్న కొణిదేల బ్యానర్ సింబల్ వున్న ప్రింట్ లు కూడా కాళ్ల దగ్గర నేలపైనే వుంచారు. దీంతో రామ్ చరణ్ తీరుపై నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు.