NTR: ఆస్కార్ పురస్కారంతో యంగ్ టైగర్ సగర్వంగా తెలుగు గడ్డపైన కాలు పెట్టారు.అపూర్వ స్వాగతం అందుకున్నారు.పెద్ద ఎత్తున తరలి వచ్చిన తారక్ అభిమానులు నినాదాలతో హోరెత్తించారు.ఇదే సమయంలో తారక్ ఎమోషనల్ అయ్యారు.తారక్తో పాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ సైతం నగరానికి చేరుకున్నారు.ఆస్కార్ అవార్డు మరింత బాధ్యతను పెంచిందన్నారు.ఆస్కార్ పురస్కారం వేళ రెడ్ కార్పెట్ పై ఆకట్టుకొనే విధంగా జూ ఎన్టీఆర్,రాం చరణ్ మెరిసారు.జూ ఎన్టీఆర్ తన డ్రస్ పై పులి బొమ్మతో సందడి చేసారు. కానీ ఆ డ్రస్సుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి.
ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా తెలుగు పాట ఖ్యాతి ఖండాంతరాలు దాటింది.తెలుగు సినిమా ఖ్యాతిని అచ్చ తెలుగు పాటకు ఆస్కార్ తో అభిమానులు ఖుషీగా ఉన్నారు. పురస్కారం అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ పురస్కారం ప్రకటన వేళ తన ఫీలింగ్స్ ఏంటో తెలుగు గడ్డ పైన కాలు పెట్టిన వేళ పంచుకున్నారు. నాటు నాటు పాటకు అవార్డు ప్రకటించిన సమయంలో ఆనందం తట్టుకోలేకపోయానని చెప్పుకొచ్చారు.
మరోవైపు ఆస్కార్ లాంటి వేదికలపైకి వెళ్తున్నట్లు ఆచితూచి వ్యవహరించాలి. డస్సింగ్ స్టైల్ దగ్గర నుంచి తన మాట తీరు వరకు అన్నీ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. లేకుండా ఆబాసుపాలు కావాల్సి వస్తోంది. అస్కార్ వేదికగా ధరించిన ఎన్టీఆర్ డ్రస్సు లాంటిదే, బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ధరించాడు. సో డ్రస్సు డిజైన్ చేయించేటప్పుడు ఇలాంటివన్నీ చూసుకోవాలని కదా అని అంటున్నారు. అయితే దీనిపై భిన్నభిప్రాయాలు మాత్రం వస్తున్నాయి.