Om Raut: సినిమా ఇండస్ట్రీలో హీరోలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అభిమానులు వారి అభిమాన హీరోల సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అని ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే సినిమాల అప్డేట్స్ గురించి కొంచం లేట్ అయినా కూడా ఎప్పుడెప్పుడు అప్డేట్స్ ఇస్తారా అని దర్శక నిర్మాతలను ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వియిగిస్తారు. ఇలా తమ అభిమాన హీరోల సినిమాల గురించి అప్డేట్స్ రాకపోతే అభిమానుల కోపానికి హీరోలు హీరోయిన్లు దర్శక నిర్మాతలు కూడా బలి కావలసి వస్తుంది.
ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోవటంతో సోషల్ మీడియా ద్వారా అభిమానులు వారి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ దర్శక నిర్మాతలను ఇబ్బందుల్లో పడేస్తుంటారు. ఇటీవల ప్రభాస్ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ కి భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారు అభిమానులుగా మారిపోయారు. ఈ క్రమంలో ప్రభాస్ సినిమా కోసం అభిమానులు ఎంతో అద్భుతంగా ఎదురు చూస్తుంటారు.
రాదే శ్యామ్ తర్వాత ఇప్పటివరకు ప్రభాస్ సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. దీంతో ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో సినిమా విడుదలవుతుందా అని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల
ఆది పురుష్ సినిమా ట్రైలర్ విడుదల చేయటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.ఇక అప్పటినుండి ఇప్పటివరకు ఆ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ కనిపించలేదు. ఈ క్రమంలో తాజాగా ఆదిపురుష్ మూవీ డైరెక్టర్ ఓంరౌత్ పై ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నప్పటికీ సినిమా ప్రమోషన్లు ప్రారంభించకపోవడంతో దర్శకుడు ఓంరౌత్ మీద ప్రభాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ‘వేక్ అప్ ఓం రౌత్’ అంటూ #StartAdipurushPromotions ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. అంతే కాకుండా కనీసం శ్రీరామనవమికైనా మూవీ అప్ డేట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఆదిపురుష్ సినిమా గురించి అప్డేట్ వస్తుందో లేదో చూడాలి మరి.