Nidhi: అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. తొలుత బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన నిధి.. ఇప్పుడు తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ ముందుకెళ్తోంది. తాజాగా నిధి ఓ డైరెక్టర్పై చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి.
కలిసిన వెంటనే ముఖం కడుక్కోమన్నాడు..
ఉదయనిధి స్టాలిన్కు జంటగా నటించిన కలగ తలైవన్ చిత్రం నిన్న విడుదలై మంచి టాక్ సాధించింది. ఈ మూవీ డైరెక్టర్ మగిళ్ తిరుమేణిని తొలిసారి కలిసినప్పుడు ఎదురైన అనుభవాన్ని ఆమె ఇటీవల వెల్లడించింది. అలా కలిసిన వెంటనే ముందు ముఖాన్ని శుభ్రపరుచుకోమని చెప్పారంది. ఆ తర్వాత ఆయన తన ముఖ కవళికలను మాత్రమే ఫొటో షూట్ చేశారని చెప్పింది. ఈ చిత్రంలో మేకప్ లేకుండా నటించానని పేర్కొంది. ఇదొక మంచి అనుభవమని తెలిపింది.
ఇక హీరో ఉదయనిధి స్టాలిన్తో నటించడంతో ఆయన నుంచి చాలా నేర్చుకున్నానంటూ చెప్పుకొచ్చింది. స్టాలిన్కు వ్యక్తిగతంగా ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ షూటింగ్లో అది కనబరిచే వారు కాదంటూ కితాబిచ్చింది. తమిళ చిత్రాల్లో నటించడం ప్రారంభించినప్పటినుంచి తమిళం నేర్చుకుంటున్నట్లు నిధి తెలిపింది.
కాగా నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్కు జంటగా హరి హర వీరమల్లు మూవీలో నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల కానున్న ఈ మూవీపై ఈ అమ్మడు ఆశలు పెట్టుకుంది. పవర్ స్టార్తో నటించిన హీరోయిన్ అంటే సాధారణంగా క్రేజ్ ఉంటుంది. దీనివల్ల మరిన్ని క్రేజీ ఛాన్స్లు వస్తాయని ఆమె భావిస్తోంది. ఈమె తెలుగులో సవ్యసాచి మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్లలో నటించింది. అయితే ఇస్మార్ట్ శంకర్ మాత్రమే హిట్ అయ్యింది.