Nikhil Siddharth: టాలీవుడ్ ఇండస్ట్రీలో హ్యాపీడేస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటుడు నిఖిల్.ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.
ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం దక్షిణాది రాష్ట్రాలలో మాత్రమే కాకుండా హిందీ భాషలో కూడా అద్భుతమైన విజయాన్ని కైవసం చేసుకుంది.తక్కువ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏకంగా 130 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది.ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో నిఖిల్ తన తదుపరి సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నారు.
సాధారణంగా ఒక సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంటే తమ తదుపరి సినిమాల విషయంలో ఎన్నో కండిషన్స్ పెట్టడం సర్వసాధారణం.కొందరు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న నిర్మాణ సంస్థలకు కమిట్ అయితే మరికొందరు రెమ్యూనరేషన్ విషయంలో భారీగా డిమాండ్స్ చేస్తారు.కానీ నిఖిల్ మాత్రం అందుకు భిన్నంగా తన సినిమాల నిర్మాణ విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టినట్టు తెలుస్తుంది.
కార్తికేయ 2సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్ భారీగా పెరగడంతో తన మార్కెట్ కి అనుగుణంగా ఈయన సినిమాలను నిర్మించాలని సినిమా బడ్జెట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో తనకు ఉన్న మార్కెట్ అనుగుణంగా సినిమాకు బడ్జెట్ కేటాయించాలని ఈయన కండిషన్స్ పెడుతున్నారట. ఈ క్రమంలోనే తన సినిమాల విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే విడుదలకు సిద్ధమైన 18 పేజెస్ సినిమాలో కొన్ని మార్పులు చేస్తూ రీ షూటింగ్ జరుపుకుంటున్నట్టు సమాచారం.