NTR: కర్ణాటకలో సత్తా చాటిన తారక్.. ఏమైందంటే?

NTR: టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కర్ణాటకలో గొప్ప గౌరవం దక్కింది. కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ విశిష్ట అతిథిగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బొమ్మై సర్కార్ కర్ణాటక దినోత్సవం నిర్వహిస్తోంది. దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ కు ప్రతిష్టాత్మక కర్ణాటక రత్న పురస్కారం అందజేయనుంది.

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందింది. తారక్ తో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొంటున్నారు. ప్రముఖ సామాజికవేత్త, ఇన్ ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తారక్ ఇప్పటికే బెంగళూరు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం కర్ణాటక ప్రభుత్వం అన్ని దినపత్రికల్లో వాణిజ్య ప్రకటనలు ఇచ్చింది. ఈ వేడుకల గురించి తెలిపింది.

ప్రకటనల్లో కర్ణాటక రాష్ట్రంతా తెలిసేలా తారక్ ఫొటోలు..

ఆ యాడ్స్ లో పునీత్ రాజ్ కుమార్ ఫొటోను పెద్దగా ప్రచురించాయి అక్కడి పత్రికలు. కర్ణాటక రత్న పురస్కారాన్ని ప్రదానం చేసే కార్యక్రమం గురించి వివరించాయి. విశిష్ట అతిథులుగా వస్తున్న రజనీకాంత్, తారక్, సుధామూర్తిల ఫొటోలను కింద ప్రచురించాయి. ఓ తెలుగు వ్యక్తి ఇతర రాష్ట్రాల్లో ఇలా ఫేమస్ గా రావడం ఇప్పుడు వైరల్ అయ్యింది.

కర్ణాటకతో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందుకంటే అతని తల్లి కూడా కన్నడిగురాలే కావడం తెలిసిందే. తారక్ అవలీలగా కన్నడ మాట్లాడుతాడు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లలో కూడా కన్నడలో మాట్లాడుతూ తారక్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో కన్నడిగులకు తారక్ బాగా దగ్గరవుతున్నాడని అనడంలో సందేహం లేదు.

Related Articles

ట్రేండింగ్

Minister Jogi Ramesh: మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలిందా.. సొంత బావమరుదులే ఆయనను ముంచేశారా?

Minister Jogi Ramesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో వైసిపి నాయకులు పెద్ద ఎత్తున సొంత పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు వైసిపి నుంచి...
- Advertisement -
- Advertisement -